You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

దిల్లీ లిక్కర్ కేసు: కల్వకుంట్ల కవితను డిసెంబర్11న కలవనున్న సీబీఐ

దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో వివరణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను డిసెంబరు 11న కలిసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అంగీకారం తెలిపింది. ఈ మేరకు కవితకు సీబీఐ ఈమెయిల్ పంపించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు మంచిదా? లేక హోం లోన్, కార్ లోన్ ఉత్తమమా?

  3. ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం చట్టబద్ధమేనా?

  4. మథురలో మసీదు ఎదుట హనుమాన్ చాలీసా చదివేందుకు వెళ్లిన హిందూ మహాసభ నాయకుడి అరెస్టు

    ఉత్తర్ ప్రదేశ్ మథురలో షాహీ ఈద్గా మసీదు ఎదుట హనుమాన్ చాలీసా చదువుతానని వచ్చిన హిందూ మహాసభ నాయకుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆయనతోపాటు వచ్చిన 40 మంది కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

    మథుర శ్రీకృష్ణ జన్మభూమి ఆవరణలో ఉండే ఈ మసీదు ఎదుట హనుమాన్ చాలీసా చదివి వినిపిస్తామని వీరు మీడియాతో చెప్పారు.

    మరోవైపు మరో ఏడు లేదా ఎనిమిది మంది హిందూ మహాసభ నాయకులకు కూడా గృహ నిర్బంధం విధించినట్లు పోలీసులు తెలిపారు.

    బాబ్రీ మసీదు కూల్చివేతకు 30 ఏళ్లు పూర్తికావడంతో మథుర షాహీ ఈద్గా మసీదు ఎదుట హనుమాన్ చాలీసా చదవడానికి రావాలని అఖిల భారతీయ హిందూ మహాసభ తమ నాయకులకు పిలుపునిచ్చింది.

  5. వివాహేతర లైంగిక సంబంధాలను నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఇండోనేసియా

  6. నోబెల్ ప్రైజ్ డిసీజ్: నోబెల్ అందుకున్న తర్వాత కొంతమంది శాస్త్రవేత్తల వింత ప్రవర్తనకు కారణం ఇదేనా?

  7. దిల్లీ లిక్కర్ కేసు: కల్వకుంట్ల కవితను డిసెంబరు 11న కలవనున్న సీబీఐ

    దిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో వివరణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను డిసెంబరు 11న కలిసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అంగీకారం తెలిపింది. ఈ మేరకు కవితకు సీబీఐ ఈమెయిల్ పంపించింది.

    దిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని తొలుత కవితకు సీబీఐ నోటీసులు పంపించింది.

    ఈ కేసులో కేంద్ర హోం శాఖ ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని సీబీఐకి కవిత లేఖ రాశారు. దీనికి స్పందిస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్‌సైట్లో ఉందని సీబీఐ అధికారులు ఆమెకు మెయిల్ పంపించారు.

    దీనిపై న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం సీబీఐ అధికారులకు కవిత ఒక లేఖ రాశారు.

    ‘‘ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లు సహా అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించాను. అందులో నా పేరు ఎక్కడా లేదు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల వల్ల ఈ నెల 6వ తేదీన నేను సీబీఐ అధికారులను కలుసుకోలేను. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని మా నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటాను. దర్యాప్తుకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశమవుతాను. త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరుతున్నాను. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. దర్యాప్తుకు సహకరిస్తాను’’అని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. దీన్ని ఈమెయిల్ ద్వారా పంపారు.

    ప్రస్తుతం కవిత లేఖకు సీబీఐ స్పందించింది. 11వ తేదీన హైదరాబాద్‌లోని కవిత నివాసంలో 11 గంటలకు భేటీ అవుతామని తెలిపింది.

  8. డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ - డీఆర్ఐ రిపోర్ట్

  9. 'పీఎం -కుసుమ్‌' అంటే ఏంటి? ఈ పథకంతో రైతులు సోలార్ పవర్ ఉత్పత్తి చేసి అమ్ముకోవచ్చా?

  10. అంబేడ్కర్ చనిపోవడానికి ముందు చివరి 24 గంటల్లో ఏం జరిగింది?

  11. భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను పెంచిన ప్రపంచబ్యాంకు

    భారత జీడీపీ వృద్ధి రేటును 2022-23 ఆర్థికసంవత్సరానికి 6.9శాతంగా ప్రపంచబ్యాంకు అంచనా వేసింది.

    గతంలో 6.5శాతంగా అంచనా వేసిన ప్రపంచబ్యాంకు తాజాగా దీన్ని పెంచింది.

    దేశంలో ఆర్థికకార్యకలాపాలు బాగా పెరిగినందున తమ అంచనాలను సవరించినట్లు ప్రపంచబ్యాంకులో సీనియర్ ఆర్థికవేత్తగా పని చేస్తున్న ధ్రువ్ శర్మ అన్నారు.

  12. మహారాష్ట్ర: 5ఏళ్ల పాపపై అత్యాచారం

    మహారాష్ట్రలో ఒక చిన్న పాపను రేప్ చేశాడనే ఆరోపణలతో షానవాజ్ షా అనే 19ఏళ్ల యువకున్ని అరెస్టు చేసినట్లు పాల్ఘర్ పోలీసులు తెలిపారు.

    పాల్ఘర్‌లోని తన ఇంటి బయట 5ఏళ్ల పాప ఆడుకుంటూ ఉండగా చాక్లెట్ ఆశ చూపించి, ఆ పాపను షానవాజ్ తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పాపకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

  13. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఒక రోజు ముందు 'రిహార్సల్స్' ఎలా జరిగాయంటే..

  14. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో ఐటీ సోదాలు

    విజయవాడలో ఇద్దరు వైసీపీ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు.

    వంశీరామ్ బిల్డర్స్ అనే కంపెనీకి సంబంధించిన ఆదాయ పన్ను తనిఖీల్లో భాగంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇళ్ల మీద ఐటీ అధికారులు దాడులు జరిపారు.

  15. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌: పారిశ్రామికవేత్త బిర్లా రూ.10 లక్షలు ఇస్తానంటే ఎందుకు తిరస్కరించారు? ‘నేను ఎవరికీ అమ్ముడు పోవడానికి పుట్టలేదు’ అని ఎందుకు అన్నారు?

  16. షాహీ ఈద్గా మసీదు మైదాన్ వద్ద హనుమాన్ చాలీసా పఠించాలంటూ అఖిల భారత హిందూ మహాసభ పిలుపు

    మథురలోని ‘శ్రీ కృష్ణ జన్మభూమి’ కాంప్లెక్స్-షాహీ ఈద్గా మసీదు మైదాన్‌లో హనుమాన్ చాలీసా పఠించాలంటూ అఖిల భారత హిందూ మహాసభ పిలుపునిచ్చింది.

    ఈ నేపథ్యంలో మథురలోని అన్ని ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు భద్రత పెంచారు. బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

    వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.

  17. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

  18. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?