కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్కు 10,07,540 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
కొనసాగుతోంది. వచ్చి నీటిని వచ్చినట్టుగానే 85 గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి వదులుతున్నారు.
భద్రాచలం, ములుగు
జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
కాళేశ్వరం వద్ద గోదావరి 12.14 అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది. 12.5
మీటర్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్కు 40,424 క్యూసెక్కుల ఇన్ఫ్లో
కొనసాగుతోంది. 4 గేట్ల ద్వారా 11,104
క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 90 టీఎంసీలకు గాను
82.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు 94,563 క్యూసెక్కుల వరద వస్తుండగా 20 గేట్ల
ద్వారా లక్షా15 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కడెం ప్రాజెక్ట్ అన్ని గేట్లను
మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో 7 టీఎంసీల పూర్తిసామర్థ్యానికి గాను 5.7
టీఎంసీల నిల్వ ఉంది.