అరవింద్ కేజ్రీవాల్: ‘ఉచితాలు రద్దు చేయాలంటున్నారు.. కేంద్రం దగ్గర డబ్బంతా ఎటు పోయింది?’

‘‘ఈ ప్రభుత్వ డబ్బుతో తమ స్నేహితుల రుణాలు మాఫీ చేస్తున్నారు. వాళ్లు తమ బిలియనీర్ స్నేహితులకు పన్నులు కూడా మాఫీ చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ విమర్శించారు.

లైవ్ కవరేజీ

  1. గత 24 గంటల్లో 16,299 కరోనా కేసులు

    గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,299 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 19,431 మంది కోలుకున్నారు.

    ప్రస్తుతం దేశంలో 1,25,076 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.58శాతంగా ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. ఆ ఊరిలో కుక్కలన్నీ కోటిశ్వరులే

    ఆ ఊరిలో కుక్కలు మాములువి కావు. వాటికి కోట్ల రూపాయల ఆస్తులుంటాయి.

    ఎకరాల కొద్దీ పొలాలుంటాయి. వాటికి ఆ ఊర్లో ప్రజలు ప్రతి రోజూ కడుపునిండా తిండి పెడతారు.

    అంతటి రిచ్ డాగ్స్ ఉన్న ఆ ఊరి కథేంటో మీరూ చూడండి.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  3. ఇన్‌కం ట్యాక్స్ విభాగం దాడుల్లో రూ.56 కోట్ల నగదు, 32 కేజీల బంగారం పట్టివేత

    డబ్బు

    ఫొటో సోర్స్, ANI

    మహారాష్ట్రలో ఉక్కు, వస్త్ర, స్థిరాస్తి వ్యాపారుల ఇళ్ల మీద ఆదాయపు పన్ను విభాగం చేసిన దాడుల్లో సుమారు రూ.56 కోట్ల నగదు, 32 కేజీల బంగారం, వజ్రాలు, ముత్యాలు లభించాయి.

    జల్నాలో ఈ నెల ఒకటి నుంచి 8 మధ్య ఈ దాడులు జరిగాయి.

    రూ.100 కోట్ల బినామీ ప్రాపర్టీని కూడా సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

    పట్టుబడిన నగదును లెక్కించడానికి 13 గంటలు పట్టినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. జమ్మూ కశ్మీర్: మిలిటెంట్ల దాడిలో ముగ్గురు సైనికులు మృతి, మోహిత్ కందారి, బీబీసీ కోసం

    భారత సైనికులు

    ఫొటో సోర్స్, ANI

    రజౌరీ జిల్లాలోని దరహాల్ ప్రాంతంలో ఉండే భారత సైనిక శిబిరం మీద మిలిటెంట్లు దాడి చేశారు.

    ఈ ఘటనలో సైనికులు, మిలిటెంట్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు మిలిటెంట్లను చంపివేయగా ముగ్గురు సైనికులు కూడా మరణించినట్లు సైనిక అధికారులు తెలిపారు.

    మిలిటెంట్లు చనిపోయినట్లు జమ్మూ అడిషనల్ డీజీపీ ముకేశ్ సింగ్ కూడా ధ్రువీకరించారు.

    దరహాల్ పోలీసు స్టేషన్‌కు 6 కిలోమీటర్ల దూరంలో సైనిక శిబిరం ఉంది.

    ప్రస్తుతం ఆ ప్రాంతంలో అదనంగా భద్రతా దళాలను మోహరించారు. చుట్టుపక్కల పరిసరాల్లో శోధాలు జరుపుతున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.