జమ్మూ కశ్మీర్ పై ఓఐసీ ప్రకటనను ఖండించిన భారత్
జమ్మూ కశ్మీర్ పై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ) చేసిన ప్రకటన మత విద్వేషాలను రగిల్చే విధంగా ఉందని అంటూ భారత్ ఆ ప్రకటనను తీవ్రంగా ఖండించింది.
ఓఐసీ చేసే ఇలాంటి ప్రకటనలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించే మతపరమైన ఎజెండాను ప్రచారం చేసేందుకు అంకితం అయిందనే విషయాన్ని తెలియచేస్తాయని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.
ఓఐసీ సెక్రెటరీ జనరల్ చేసిన ప్రకటన మత విద్వేషాలను రగిల్చే విధంగా ఉందని అన్నారు. జమ్మూ, కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని, వక్కాణించారు.
జమ్మూ కశ్మీర్ లో మూడేళ్ళ క్రితం తీసుకున్న నిర్ణయాలకు ఫలితంగా ఇప్పుడిప్పుడేసామాజిక ఆర్ధిక అభివృద్ధి కనిపిస్తోంది" అని అన్నారు.
"మానవ హక్కులను ఉల్లంఘిస్తూ, సరిహద్దుల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే వారి ఆదేశాల మేరకు ఓఐసీ ఇటువంటి ప్రకటనలు చేస్తోంది" అని అరిందమ్ బాగ్చి అన్నారు.
కశ్మీర్ లో ఆర్టికల్ 370ను తొలగించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఓఐసి శుక్రవారం కశ్మీర్లో మానవ హక్కుల గురించి ప్రస్తావిస్తూ భారత్ తన నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల కనుగుణంగా జమ్మూ కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఓఐసి అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.
భారత ప్రభుత్వం 2019లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించి ఆర్టికల్ 370 ను రద్దు చేసింది.