You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

‘దేశాన్ని బీజేపీకి రాసివ్వలేదు... టీఆర్ఎస్, జాతీయ పార్టీగా మారితే తప్పేంటి?’- కేసీఆర్

న‌రేంద్ర మోదీ పాల‌న‌లో కార్పొరేట్ల‌కు మాత్ర‌మే లాభం జ‌రిగింద‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. శ్రీలంక‌లో దేశం గౌరవం పోతోందని అన్నారు. భార‌త ప్ర‌ధాని స్థాయి దిగ‌జారింద‌ని విమ‌ర్శించారు.

లైవ్ కవరేజీ

  1. శ్రీలంక: ఐఎంఎఫ్ ఏం చెబుతోంది?

    శ్రీలంకలో నిరసనల నడుమ వేగంగా రాజకీయ పరిణామాలు మారుతుంటే.. ఇక్కడి ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దడంపై దృష్టిపెట్టనట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వెల్లడించింది.

    ‘‘ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నాం’’అని ఐఎంఎఫ్ తెలిపింది.

    మరోవైపు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు త్వరగా చర్యలు తీసుకోవాలని అమెరికా కూడా శ్రీలంకను కోరింది.

    ‘‘పరిస్థితులు మెరుగుపడేలా శ్రీలంక పార్లమెంటు చర్యలు తీసుకోవాలి’’అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

    ‘‘శాంతియుతంగా నిరసనలు చేపట్టే హక్కు శ్రీలంక ప్రజలకు ఉంది. కానీ, దాడులు చేయకూడదు. హింసపై దర్యాప్తు చేపట్టాలని మేం డిమాండ్ చేస్తున్నాం. హింసాత్మక చర్యలకు పాల్పడే వారిని అరెస్టు చేయాలి’’అని ఆయన వ్యాఖ్యానించారు.

  2. తెలంగాణ: అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు.. మరో రెండు రోజులు ఇలానే ఉంటుందని ఐఎండీ హెచ్చరికలు, శుభం ప్రవీణ్ కుమార్, బీబీసీ కోసం

    అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

    ఎగువ ప్రాంతాల్లో ముఖ్యంగా మహారాష్ట్రలోని గోదావరి, ప్రాణహిత బేసిన్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది.

    మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీచేసింది.

    గడిచిన 7 గంటల్లో అత్యధికంగా జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కాటారంలో 32.3 సెం.మీ., ముత్తారం మహదేవ్‌పూర్‌లో 32 సెం.మీ., నిర్మల్ జిల్లా ముధోల్‌లో 22.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

    నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 48.94 టీఏంసీల నీరు నిల్వ ఉంది. దీని పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు.

    కృష్టా పరివాహక ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.

    ఆదిలాబాద్‌లోని ముధోల్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. భైంసాలోనూ ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది.

  3. అమెరికా అబార్షన్ హక్కుల కోసం వైట్‌హౌస్ వెలుపల మహిళల నిరసన

    అబార్షన్ హక్కుల కోసం అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో వేల మంది మహిళలు నిరసనలు చేపట్టారు.

    రెండు వారాల క్రితం ‘‘రో వర్సెస్ వేడ్’’ కేసులో అమెరికా సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 50ఏళ్ల క్రితం అబార్షన్‌ను దేశ వ్యాప్తంగా చట్టబద్ధం చేస్తూ వెలువడిన తీర్పును కోర్టు కొట్టివేసింది.

    దీనికి వ్యతిరేకంగా శనివారం వేల మంది మహిళలు వైట్‌హైస్ వెలుపల నిరసన చేపట్టారు. ‘‘మేం హక్కుల విషయంలో వెనకడుగు వేయాలని అనుకోవట్లేదు’’అని వారు నినాదాలు చేశారు.

    అబార్షన్ హక్కులను పరిరక్షించే ఒక ఆదేశంపై శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. అయితే, ఈ విషయంలో అధ్యక్షుడికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయి. సుప్రీం కోర్టు తీర్పుకు ఆయన వ్యతిరేకంగా వెళ్లలేరు.

    ‘‘బైడెన్ అధికారానికి పరిమితులు ఉన్నాయని తెలుసు. కానీ, ఆ పరిమితులకు ఎదురువెళ్లి ఆయన మా హక్కులను పరిరక్షించాలి’’అని నిరసనలు చేపడుతున్న రేచల్ కర్మోనా వ్యాఖ్యానించారు.

  4. ‘బీబీసీ తెలుగు’ లైవ్ పేజీకి స్వాగతం

    జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు తెలుగు రాష్ట్రాల న్యూస్ అప్‌డేట్స్ కోసం ‘బీబీసీ తెలుగు’ లైవ్ పేజీ చూస్తూ ఉండండి.

  5. ‘మేల్ సెక్స్ వర్కర్‌‌గా నేను ఎందుకు మారాల్సి వచ్చిందంటే...’ - #HisChoice