ఉద్ధవ్ ఠాక్రే: ‘‘శివసేనను అంతం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోంది’’

ఫొటో సోర్స్, Shivsena@Twitter
తమ పార్టీని అంతం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
శివసేన భవన్లో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు.
‘‘మీకు ధైర్యముంటే మధ్యంతర ఎన్నికలు పెట్టి, గెలిచి చూపించండి’’అని ఆయన సవాల్ విసిరారు.
‘‘ఇది శివసేనను అంతం చేయడానికి బీజేపీ పన్నుతున్న కుట్ర. ఇలాంటి ఆటలు ఆడేకంటే.. ప్రజల దగ్గరకు వెళ్లి తేల్చుకుందాం రండి. మాది తప్పయితే, ప్రజలే తీర్పునిస్తారు. లేకపోతే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది











