You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఉద్ధవ్ ఠాక్రే: ‘‘శివసేనను అంతం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోంది’’

తమ పార్టీని అంతం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. ఉద్ధవ్ ఠాక్రే: ‘‘శివసేనను అంతం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోంది’’

    తమ పార్టీని అంతం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.

    శివసేన భవన్‌లో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు.

    ‘‘మీకు ధైర్యముంటే మధ్యంతర ఎన్నికలు పెట్టి, గెలిచి చూపించండి’’అని ఆయన సవాల్ విసిరారు.

    ‘‘ఇది శివసేనను అంతం చేయడానికి బీజేపీ పన్నుతున్న కుట్ర. ఇలాంటి ఆటలు ఆడేకంటే.. ప్రజల దగ్గరకు వెళ్లి తేల్చుకుందాం రండి. మాది తప్పయితే, ప్రజలే తీర్పునిస్తారు. లేకపోతే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

  2. 'కాళి' పోస్టర్‌‌పై వివాదం: నోటిలో సిగరెట్, చేతిలో ఎల్జీబీటీ జెండా.. డైరెక్టర్ లీనా మణిమేకలైపై పోలీసులకు ఫిర్యాదు

  3. ప్రధాని హెలికాప్టర్‌పైకి కాంగ్రెస్ నల్ల బెలూన్లు.. మోదీ భద్రతలో వైఫల్యం ఉందా? లేదా?

  4. ‘కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించట్లేదు’ - ప్రధాని మోదీకి ఆహ్వానం పలకకపోవడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

    ప్రధాని మోదీ గత ఆరు నెలల కాలంలో మూడుసార్లు హైదరాబాద్ వెళ్లగా, ఈ మూడు సార్లూ సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకలేదు. పైగా, శనివారం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికారు.

    దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ‘‘ఒక రాజకీయ స్నేహితుడిగా ఆయన ఎవరికి స్వాగతం పలుకుతారు అనేది నాకు ముఖ్యం కాదు. అది ఆయన సమస్య. కానీ, తాను ఒక ముఖ్యమంత్రిని అని కేసీఆర్ మర్చిపోకూడదు. సమాఖ్య వ్యవస్థలో ప్రజలు రెండు సార్లు ఈ దేశానికి ప్రధాన మంత్రిగా ఎన్నుకున్న వ్యక్తి మోదీ. కాబట్టి రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడం కోసం ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానికి స్వాగతం పలకడం మర్యాద. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. ప్రధాన మంత్రికి ఆహ్వానం పలికినట్లుగా. రాజ్యాంగబద్ధతపై కేసీఆర్‌కు గౌరవమే లేదు. ఆయన తన రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించలేదు. దురదృష్టకరం’’ అని ధర్మేంద్ర ప్రధాన్ అన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

  5. ఒకప్పుడు 90 శాతం క్రైస్తవులే ఉన్న ఈ దేశంలో ఇప్పుడు క్రిస్టియన్లు తగ్గిపోతున్నారు.. హిందూ, ముస్లింలు వేగంగా పెరిగిపోతున్నారు

  6. బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?

  7. జంతర్ మంతర్: నక్షత్ర వీధికి భారత ముఖద్వారం ఇదేనా, కళ్లతోనే గ్రహాల దూరాలను చెప్పేయవచ్చా

  8. హిమాచల్ ప్రదేశ్ బస్సు ప్రమాదం: ‘12 మంది మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు’- మంత్రి సురేశ్ భరద్వాజ్

    కులు జిల్లాలో లోయలో పడిన బస్సు ప్రమాదంలో 12 మంది మరణించినట్లు, ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు హిమాచల్ ప్రదేశ్ మంత్రి సురేశ్ భరద్వాజ్‌‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

    ‘‘ఘటనా స్థలంలో బాధితులు అందరినీ గుర్తించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బస్సులో 15 మంది మాత్రమే ఉన్నారు’’ అని సరేశ్ చెప్పినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

  9. పుండీ సారు: ఝార్ఖండ్‌కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది

  10. ‘ఇంత చిన్నమ్మాయి హెలీకాప్టర్ నడిపిస్తుందా అని అంతా ఆశ్చర్యపోయారు’

  11. ‘‘నేను చూస్తుండగానే నా భర్తను వరద నీరు ముంచెత్తి ప్రాణం తీసింది’’

  12. మహారాష్ట్ర: బలపరీక్షలో నెగ్గిన శిందే సర్కారు

    మహారాష్ట్ర శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం విజయం సాధించింది. విజయానికి 143 ఓట్లు అవసరం కాగా, శిందే ప్రభుత్వానికి 164 ఓట్లు లభించాయి.

    అదే సమయంలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి.

    సమయం మించిపోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు సభలోకి రాలేకపోయారని చెబుతున్నారు.

    తొలుత వాయిస్ ఓటింగ్‌ను నిర్వహించారు. కానీ ఈ విధానం ద్వారా స్పష్టత రాకపోవడంతో పాటు విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తర్వాత ఓటింగ్‌ను నిర్వహించారు.

    దీని తర్వాత ఓట్లను లెక్కించారు.

  13. ‘ఆదివాసీల శౌర్యపరాక్రమాలకు ప్రతీక అల్లూరి’- ప్రధాని నరేంద్ర మోదీ

    ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి, వీరభూమి. ఇలాంటి ప్రదేశానికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

    అల్లూరి 125 జయంతి ఉత్సవాల సందర్భంగా భీమవరం సమీపంలోని పెద అమిరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.

    మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు... ‘తెలుగు వీర లేవరా, దీక్ష బూని సాగరా’ అంటూ స్వాతంత్ర్య సంగ్రామంలో యావత్ భారతావనికి స్ఫూర్తిగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం అంటూ మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

    పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి మహనీయులకు పురుడు పోసిన గడ్డ ఆంధ్ర రాష్ట్రమని ఆయన కొనియాడారు.

    ఇంకా ఆయన ఏమన్నారంటే...

    • ఆంగ్లేయులకు ఎదురొడ్డి ఎందరో యువకులు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు.
    • ఆదివాసీల శౌర్య పరాక్రమాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు.
    • మనదే రాజ్యం నినాదంతో ప్రజలందర్నీ అల్లూరి ఏకతాటిపైకి తీసుకొచ్చారు.
    • ఆంధ్రప్రదేశ్ వీరభూమి, దేశభక్తుల గడ్డ. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి ఉద్యమకారుడు ఇక్కడే జన్మించారు.
    • ఈ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
    • రంప ఉద్యమం ప్రారంభమై నేటికి వందేళ్లు.
    • స్వాతంత్ర్య సంగ్రామంలో ఆదివాసీల బలిదానాన్ని ప్రస్పుటించేలా ఆదివాసీ మ్యూజియంను ఏర్పాటు చేయనున్నాం.
    • లంబసింగిలో అల్లూరి మెమోరియల్, ఆదివాసీల మ్యూజియం నెలకొల్పుతాం.
    • ఆదివాసీల సంస్కృతిని ఆంగ్లేయులు నాశనం చేశారు.
    • అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆదివాసీ యువకులు ముందుకు రావాలి.
  14. ‘అల్లూరి సీతారామరాజును గుండెల్లో పెట్టుకున్నాం’- ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

    అల్లూరి సీతారామరాజును గుండెల్లో పెట్టుకున్నాం. అందుకే జిల్లాల పునర్విభజనలో ఒక జిల్లాకు ఆయన పేరును పెట్టామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

    తరతరాలకు సందేశం ఇచ్చేలా జీవించిన అల్లూరిని తెలుగు జాతి ఎన్నటికీ మరచిపోదని వ్యాఖ్యానించారు.

    అల్లూరి 125 జయంతి ఉత్సవాల సందర్భంగా భీమవరం సమీపంలోని పెద అమిరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు.

    ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వర్చువల్‌గా సభా వేదిక నుంచే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

    అనంతరం అల్లూరి వంశీయులను ప్రధాని నరేంద్ర మోదీ శాలువాతో సత్కరించారు.

  15. మెట్లపై నుంచి జారి పడిన లాలూ ప్రసాద్ యాదవ్, ఆసుపత్రికలో చేరిక

    రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.

    ఇంట్లో మెట్ల మీద నుంచి పడిపోవడంతో ఆయనకు గాయాలయ్యాయి.

    వార్తా ఏజెన్సీ ఏజెన్సీ ప్రకారం, ఆదివారం లాలూ ప్రసాద్ యాదవ్, తన ఇంట్లోని మెట్లపై నుంచి జారి పడ్డారు. దీంతో ఆయన కుడి భుజానికి స్వల్పంగా ఫ్రాక్చర్ అయింది.

    అయితే, భుజం ఫ్రాక్చర్ కావడంతో పాటు వీపుకు కూడా గాయాలైనట్లు లాలూ కుటుంబ సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

    లాలూ ప్రసాద్‌ను ఉదయం 3 గంటల సమయంలో ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చారని పారస్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆసిఫ్ రహమాన్ చెప్పారు.

    ‘‘ఆ సమయంలో భుజం గాయం కారణంగా ఆయన పరిస్థితి బాగా లేదు. వైద్యులు ఆయనను ఐసీయూలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది’’ అని రహమాన్ తెలిపారు.

    లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ మార్పిడి కోసం విదేశాలకు వెళ్లడం గురించి ఇటీవల ఆయన కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

  16. హిమాచల్ ప్రదేశ్: లోయలో పడిన ప్రైవేట్ బస్సు, 10 మంది మృతి

    హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైనట్లు కులు డిప్యూటీ కమిషనర్ అశుతోష్ గార్గ్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    ‘‘సైంజ్ వ్యాలీలోని నియోలీ-షంషేర్ రహదారిలో ప్రయాణిస్తోన్న బస్సు జంగ్లా ప్రాంతంలో కొండపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    గాయపడిన పడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నాం. ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. బస్సులో పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు భావిస్తున్నాం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని అశుతోష్ గార్గ్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

    అయితే, ఈ ఘటనలో 16 మంది మరణించారని అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. ఇందులో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిపింది.

    ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు.

    ‘‘హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో జరిగిన ప్రమాదం హృదయ విదారకం. ఈ విషాద ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలుగా సహకరిస్తోంది’’ అని ట్వీట్ చేశారు.

  17. మహారాష్ట్ర: శిందే సర్కారు విశ్వాస పరీక్షకు ముందు ఉద్ధవ్ ఠాక్రేకు ఎదురు దెబ్బ

    మహారాష్ట్ర శాసన సభాపతి (స్పీకర్)గా ఆదివారం ఎన్నికైన రాహుల్ నర్వేకర్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కష్టాలను మరింత పెంచారు.

    శివసేన శాసనసభాపక్ష నేతగా ఉన్న అజయ్ చౌధరీని తొలిగించి ఆయన స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అసమ్మతి వర్గం నాయకుడు ఏక్‌నాథ్ శిందేను నియమించారు.

    శివసేన చీఫ్ విప్‌ను కూడా స్పీకర్ మార్చారు. సునీల్ ప్రభు స్థానంలో శిందే వర్గ ఎమ్మెల్యే భరత్ గోగావాలేను చీఫ్ విప్‌గా నియమించారు.

  18. భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?

  19. భారత్‌లో కొత్తగా 16,135 కరోనా కేసులు

    భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

    ఆదివారం 13,958 మంది కరోనా నుంచి కోలుకోగా, 24 మంది చనిపోయారు.

    తాజా కేసులతో దేశంలో క్రియా శీల కేసుల సంఖ్య 1,13,864కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.85 శాతంగా ఉంది.

  20. డెన్మార్క్ కాల్పులు: షాపింగ్‌మాల్‌పై దాడిలో ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

    డెన్మార్క్‌లోని అతిపెద్ద షాపింగ్ మాల్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.

    మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

    దక్షిణ కోపెన్‌హాగన్‌లోని ఫీల్డ్స్ మాల్‌లో ఆదివారం 22 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

    దాడికి గల కారణం అస్పష్టంగా ఉందని పోలీస్ చీఫ్ సోరెన్ థామ్సన్ అన్నారు. ఇది ‘తీవ్రవాద దాడి’ అనే అంశాన్ని కొట్టిపారేయలేమని ఆయన అన్నారు.

    పోలీసులు చెప్పినదాని ప్రకారం, దాడి చేసిన యువకుడి వద్ద రైఫిల్‌తో పాటు ఆయుధాలు ఉన్నాయి. ఈ దాడిలో మిగతా వ్యక్తుల ప్రమేయంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.

    డెన్మార్క్‌పై క్రూరమైన దాడి జరిగిందని ప్రధానమంత్రి మాట్ ప్రెరిక్సన్ వ్యాఖ్యానించారు.

    ‘‘చాలా మంది గాయపడ్డారు, చనిపోయారు. అమాయక ప్రజలు షాపింగ్ చేస్తున్నారు. భోజనం చేస్తున్నారు. అందులో చిన్నారులు, యువకులు కూడా ఉన్నారు. మా సుందరమైన, సురక్షితమైన రాజధాని కొన్ని సెకన్లలోనే భయానకంగా మారిపోయింది. ఈ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో దేశమంతా ఐక్యంగా ఉండాలని, ఒకరికొకరు మద్దతుగా నిలవాలని’’ మాట్ అన్నారు.

    బాధితులకు, వారి కుటుంబాలకు డెన్మార్క్ రాజకుటుంబం ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

    ఈ బహుళ అంతస్తుల షాపింగ్ మాల్‌లో దాదాపు 140 దుకాణాలు, రెస్టారెంట్లు ఉన్నాయి.కాల్పుల శబ్ధం వినగానే భయాందోళనలకు గురయ్యామని ఘటన సమయంలో అక్కడున్న ప్రజలు చెబుతున్నారు.

    ఇసాబెల్లె అనే ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అకస్మాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. నేను 10 సార్లు కాల్పుల శబ్దం విన్నాను.తర్వాత పరుగున వెళ్లి టాయిలెట్‌లో దాక్కున్నాం. దాదాపు 11 మంది అందులో దాక్కున్నాం. మేమేంతా చాలా భయపడ్డాం. ఇది చాలా భయంకరమైన అనుభవం’’ అని చెప్పారు.