You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అమిత్ షా: ‘తెలంగాణ నిజాంను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పీకి పారేస్తాం’

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో నిజాంను మార్చేస్తాం. రజాకార్ల ఒడిలో కూర్చున్న కేసీఆర్‌ను మార్చేస్తాం’’ అని ప్రకటించారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్ and ఆలమూరు సౌమ్య

  1. నేటి ముఖ్యాంశాలు

    • దేశ రాజధాని దిల్లీలోని ముండ్కాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారని ఔటర్ డీసీపీ సమీర్ శర్మ తెలిపారు.
    • గోధుమల ఎగుమతులపై భారతదేశం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వచ్చింది.
    • రష్యాతో యుద్ధం ఆగస్టు మధ్యలో మలుపు తీసుకుంటుందని, ఈ ఏడాది చివరి నాటికి ముగుస్తుందని యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ అన్నారు.
    • జ్ఞాన్‌వాపి మసీదు కేసుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, ముస్లింలు ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయారని, ఎట్టి పరిస్థితుల్లోనూ మరో మసీదును పొగొట్టుకోలేరని అన్నారు.
    • త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ఎన్నికయ్యారు.
    • నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌కు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో అవమానకరమైన పోస్టును షేర్ చేసిన మరాఠీ నటి కేత్కీ చితాలేను థానే పోలీసులు అరెస్ట్ చేశారు.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  2. పిల్లి అని ఇంటికి తెచ్చుకున్నారు.. అది పులి.. ఆ తర్వాత ఏమైందంటే..

  3. Bra ఎంపికలో మహిళలు చేసే పొరపాట్లు ఇవే.. ‘బ్రా’ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..

  4. శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి అరెస్ట్

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌కు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో అవమానకరమైన పోస్టును షేర్ చేసిన మరాఠీ నటి కేత్కీ చితాలేను థానే పోలీసులు అరెస్ట్ చేశారు.

    ఆమె ఇంటి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా... ఎన్సీపీ కార్యక్తలు ఆమెపై సిరా, గుడ్లను విసిరారు. దీంతో పాటు ఆమెను తోసేందుకు ప్రయత్నించారు.

    కేత్కీ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వారు చేశారు.మహారాష్ట్రలోని థానే నగరంలో ఆమెపై కేసు నమోదైంది.

    మరాఠీలో రాసిన ఆ పోస్ట్‌లో ఎన్సీపీ అధినేత పేరును ప్రస్తావించలేదు.కానీ, ఆయన ఇంటిపేరు అయిన ‘పవార్’, ‘80 సంవత్సరాల వయస్సు’ను ప్రస్తావించారు. ప్రస్తుతం శరద్ పవార్‌ వయస్సు 81 సంవత్సరాలు.

    ఆ పోస్టులో "నరకం మీకోసం ఎదురుచూస్తోంది", "మీరు బ్రాహ్మణులను ద్వేషిస్తున్నారు" వంటి వ్యాఖ్యలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో పరువు నష్టం, ప్రజల మధ్య విద్వేషాలు వ్యాప్తి చేయడంతో సహా పలు అభియోగాలు మోపుతూ కేత్కిపై కేసు నమోదు చేశారు.

    ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌ను ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే ఖండించారు.మహారాష్ట్ర సంస్కృతిలో ఇలాంటి వాటికి స్థానం లేదని ఆయన అన్నారు.

  5. బ్రేకింగ్ న్యూస్, అమిత్ షా: ‘తెలంగాణ నిజాంను మార్చేస్తాం’

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తెలంగాణ నిజాం అని సంబోధించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.

    తెలంగాణలో నిజాంను తాము మార్చేస్తామని, రజాకార్ల ఒడిలో కూర్చుని పాలన చేస్తున్న కేసీఆర్‌ను మార్చేస్తామని తెలిపారు.

    భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు కార్యక్రమంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా అమిత్ షా ఏమన్నారంటే..

    • నా జీవితంలో ఇంత పనికిరాని, అవినీతి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు
    • ఈ యాత్ర ఒక పార్టీని తొలగించి, మరొక పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కాదు. ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేయడం కోసం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం కాదు. తెలంగాణ దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత కోసం చేపట్టిన యాత్ర
    • మజ్లిస్‌ను చూసి భయపడే కేసీఆర్‌ను (ముఖ్యమంత్రి స్థానం నుంచి) పీకి పారేసే యాత్ర
    • తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అని కేసీఆర్ హామీ ఇచ్చారు. అందులో ఏవీ పూర్తి కాలేదు. మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మేం పూర్తి చేసి చూపిస్తాం.
    • కేసీఆర్ తెలంగాణను మరో బెంగాల్ చేయాలనుకుంటున్నారు. ఆయన్ని ఆపాలి
    • తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ, చేయలేదు. ఎందుకంటే మజ్లిస్‌ను చూసి భయపడుతున్నారు. మజ్లిస్, కేసీఆర్ ఇద్దరినీ పీకి పారేయాలి.

    అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే...

    • తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం లూఠీ చేస్తోంది. ఈ ప్రభుత్వం బారినుంచి ప్రజల్ని కాపాడుకోవాలని పాదయాత్ర చేస్తుంటే ప్రజలంతా ఎన్నో సమస్యలను నా ముందుకు తీసుకొచ్చారు.
    • తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పాలన సాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం వద్దే ఉన్నాయి. ఒక కుటుంబం రాజ్యమేలితే శ్రీలంక లాంటి పరిస్థితే మనకు వస్తుంది. ఈ ప్రభుత్వం, రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తోంది.
    • కేంద్రం ఇస్తున్న నిధులను డైవర్ట్ చేస్తూ ప్రజల్ని మోసగిస్తోంది.
    • పేదల స్థలాలను లాక్కుంటూ ధరణి పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది.
    • పేదవాళ్ల కోరికలు నెరవేరాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలి. అధికారంలోకి వస్తే అర్హులైన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మిస్తాం. ఉద్యోగాలు ప్రకటిస్తాం.
  6. త్రిపుర కొత్త ముఖ్యమంత్రి మాణిక్ సాహా

    త్రిపుర రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ఎన్నికయ్యారు.

    సీఎం పదవికి బిప్లబ్ కుమార్ దేవ్ రాజీనామా చేయడంతో.. అధికార బీజేపీ శాసనసభా పక్ష సమావేశం శనివారం జరిగింది.

    ఈ సమావేశంలో మాణిక్ సాహాను తమ నాయకుడిగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

    డాక్టర్ మాణిక్ సాహా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.

  7. రాహుల్ ద్రవిడ్: ప్రజల మధ్యలో కూర్చున్నా భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌ను ఏ ఒక్కరూ గుర్తుపట్టనప్పుడు..

  8. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ రాజీనామా

    త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారు.

    ముఖ్యమంత్రి తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారని పీటీఐ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

    గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బిప్లబ్ దేవ్ భేటీ అయ్యారు.

    త్రిపుర రాష్ట్ర బీజేపీలో అంతర్గతంగా ఏర్పడిన వివాదాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని పార్టీ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ పేర్కొంది. తాత్కాలికంగా ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరిస్తారని వెల్లడించింది.

    వచ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం ఈ సందర్భంగా గమనార్హం.

    రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని రాజీనామా అనంతరం బిప్లబ్ కుమార్ దేవ్ చెప్పారు.

    కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయని పీటీఐ పేర్కొంది.

  9. భారత వెబ్ సిరీస్‌లలో ఉత్తరప్రదేశ్ ఎందుకు హింసా రాజ్యంగా మారిపోయింది?

  10. హీట్‌వేవ్: పర్యావరణ మార్పుల వల్ల మనం ఎదుర్కొంటున్న 4 పెను సమస్యలు..

  11. యుక్రెయిన్ యుద్ధం: "ఖార్కియెవ్‌లో యుద్ధం గెలిచినట్టే"

    యుక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు ఏం జరిగిందంటే..

    • యుక్రెయిన్ "ఖార్కియెవ్‌లో యుద్ధం గెలిచిందని" ప్రముఖ మిలిటరీ థింక్-ట్యాంక్, ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ పేర్కొంది. రష్యా దళాలు ఖార్కియెవ్ నగరం నుంచి వైదొలగుతున్నట్టు ఆ సంస్థ తెలిపింది.
    • రష్యన్ సేనలు ఖార్కియెవ్ నగరం నుంచి వైదొలగి రష్యా సరిహద్దులకు చేరుకుంటున్నాయని నగర మేయర్ ఇహోర్ తెరెఖోవ్ బీబీసీకి తెలిపారు.
    • "ప్రస్తుతం శత్రు సేనలు ఖార్కియెవ్‌ నుంచి తమ యూనిట్ల ఉపసంహరణపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయని" యుక్రెయిన్ మిలటరీ తెలిపింది.
    • నివాసితులు తిరిగి ఖార్కియెవ్‌ నగరంలోకి ప్రవేశిస్తున్నారని, యుద్ధం కారణంగా నాశనమైపోయిన నగరాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలు జరుగుతాయని ఖార్కియెవ్‌ గవర్నరు తెలిపారు. అయితే, ఇప్పటికీ నగరం పూర్తిగా సురక్షితమని చెప్పలేమంటూ ఆయన హెచ్చరించారు.
    • రష్యాతో యుద్ధం ఆగస్టు మధ్యలో మలుపు తీసుకుంటుందని, ఈ ఏడాది చివరి నాటికి ముగుస్తుందని యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ అన్నారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మేజర్ జనరల్ కైరిలో బుడనోవ్ మాట్లాడుతూ, "ఆగస్టు రెండో సగంలో బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. ఏడాది చివరకి క్రియాశీలక పోరాటం ముగుస్తుంది. తత్ఫలితంగా, డాన్‌బాస్, క్రిమియా సహా మేం కోల్పోయిన అన్ని భూభాగాల్లో యుక్రెయిన్ పాలనను పునరుద్ధరిస్తాం" అని అన్నారు.
    • స్వీడన్, ఫిన్లాండ్ దేశాలను శనివారం జరిగే నాటో విదేశాంగ మంత్రుల సమావేశానికి అతిథులుగా ఆహ్వానించారు. అయితే, పాశ్చాత్త కూటమిలో చేరితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని క్రెమ్లిన్ ఆ దేశాలకు హెచ్చరిస్తూనే ఉంది.
  12. దిల్లీ అగ్నిప్రమాదం: 'నా గర్ల్ ఫ్రెండ్ మంటల్లో చిక్కుకుంది. నాకు వీడియో కాల్ చేసింది.. రక్షించలేకపోయా'

  13. విజయనగరం: ఆటపాటలు, బుర్రకథలతో సోషల్ పాఠాలు చెబుతున్న టీచర్

  14. 'బాబ్రీ మసీదును కోల్పోయాం, మరో మసీదును పోగొట్టుకోలేం' - ఒవైసీ

    జ్ఞాన్‌వాపి మసీదు కేసుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, ముస్లింలు ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయారని, ఎట్టి పరిస్థితుల్లోనూ మరో మసీదును పొగొట్టుకోలేరని అన్నారు.

    "బాబ్రీ మసీదుపై కోర్టు నిర్ణయం వచ్చేసింది. ఇప్పుడు జ్ఞాన్‌వాపి విషయం మొదలైంది. ఇప్పటికే బాబ్రీ మసీదుని కోల్పోయాం. మరో మసీదుని కోల్పోలేమని ప్రభుత్వానికి చెబుతున్నాను" అని ఒవైసీ అహ్మదాబాద్‌లోని ఒక ప్రసంగంలో అన్నారు. ఈ మేరకు ఏఎన్‌ఏ వార్త ప్రచురించింది.

    ముస్లింలను ఓటు బ్యాంకు పేరుతో మోసపుచ్చుతున్నారని ఒవైసీ ఆరోపించారు.

    "ఈ దేశంలో ముస్లింలు ఎప్పుడూ ఓటు బ్యాంకు కారు. భవిష్యత్తులో కాబోరు. కేవలం మిమ్మల్ని ఈ మాటలతో ఊరిస్తుంటారు. ప్రభుత్వాన్ని, అధికారాన్ని మనం మార్చలేం. మార్చగలిగిగితే, భారత పార్లమెంటులో ఇంత తక్కువమంది ముస్లింలు ఎందుకున్నారు? బాబ్రీ మసీదుపై కోర్టు తీర్పు అయిపోయింది. ఇప్పుడు జ్ఞాన్‌వాపి కేసు మొదలైంది" అని అన్నారు.

  15. దిల్లీలో అగ్నిప్రమాదం: ‘భవనంలో మా చెల్లి కనిపించింది.. కానీ అటువెళ్లి ఇటువచ్చేసరికి అక్కడ లేదు.. ఫోన్ కూడా కలవట్లేదు’

  16. యుక్రెయిన్ యుద్ధం: 'ఈ ఏడాది చివరికి యుద్ధం ముగిసే అవకాశం ఉంది'

    రష్యాతో యుద్ధం ఆగస్టు మధ్యలో మలుపు తీసుకుంటుందని, ఈ ఏడాది చివరి నాటికి ముగుస్తుందని యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ అన్నారు.

    స్కై న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మేజర్ జనరల్ కైరిలో బుడనోవ్ మాట్లాడుతూ, "ఆగస్టు రెండో సగంలో బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. ఏడాది చివరకి క్రియాశీలక పోరాటం ముగుస్తుంది. తత్ఫలితంగా, డాన్‌బాస్, క్రిమియా సహా మేం కోల్పోయిన అన్ని భూభాగాల్లో యుక్రెయిన్ పాలనను పునరుద్ధరిస్తాం" అని అన్నారు.

    యుద్ధంలో రష్యా ఓడిపోతే, అది ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటుకు దారి తీస్తుందని, ఇప్పటికే అది జరుగుతోందని ఆయన అన్నారు. బీబీసీ ఈ వాదనను స్వతంత్రంగా ధృవీకరించలేదు.

    ప్రెసిడెంట్ పుతిన్ "మానసికంగా, శారీరక మంచి స్థితిలో లేరని, ఆయన అనారోగ్యంతో ఉన్నారని" మేజర్ జనరల్ కైరిలో అన్నారు. అయితే ఆయన వాదనకు రుజువు చూపలేదు.

  17. హోంలోన్ వడ్డీ రేటు పెరిగినప్పుడు టెన్యూర్ పెంచుకుంటే మంచిదా లేక EMI ఎక్కువ కడితే బెటరా..

  18. దిల్లీలో అగ్నిప్రమాదం: ఘటనా స్థలానికి కేజ్రీవాల్.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

    దిల్లీలోని ముండ్కాలో అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.

    ఈ ప్రమాదంలో కనిపించకుండా పోయినవారి కోసం ఒక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశామని, దాని ద్వారా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

    ఈ ఘటనపై మెజిస్ట్రేట్ స్థాయి విచారణకు ఆదేశించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.

    అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు యాభై వేల రూపాయలు పరిహారంగా అందజేస్తామని తెలిపారు.

  19. మహబూబ్‌నగర్ జిల్లా: ఉదయం పెళ్లి.. సాయంత్రం పెళ్లికూతురు ఆత్మహత్య, శుభం ప్రవీణ్ కుమార్, బీబీసీ కోసం

    గమనిక: ఇందులోని కొన్ని విషయాలు మీ మనసును కలిచివేయవచ్చు.మహబూబ్‌నగర్ జిల్లా పాతతోట ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే నవ వధువుపెళ్లి రోజే ఆత్మహత్యచేసుకుంది.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాతతోటలోని స్వగృహంలో లక్ష్మీకి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన మల్లికార్జున్‌తో మే 13న ఉదయం తొమ్మిదిన్నరకు పెళ్లి జరిగింది.

    పెళ్లి వేడుకలో హుషారుగా కనిపించిన లక్ష్మీ,తంతు ముగిసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మేడపైకి వెళ్లి పురుగుల మందు తాగింది.

    ఎంతకూ రాకపోవడంతో కుటుంబ సభ్యులు గది లోపలికి వెళ్లి చూడగా అపస్మాకర స్థితిలో కనిపించింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ లక్ష్మీ అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పారు.

    ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    ‘అనంతపురం చాలా దూరం అని, తనకు అంత దూరం వెళ్లడం ఇష్టం లేదని లక్ష్మీ గతంలో తన కుటుంబ సభ్యులకు చెప్పింది. పుట్టింటికి అత్తారిల్లు చాలా దూరమని లక్ష్మీ ఆవేదన చెందింది. అయినా కుటుంబ సభ్యులు ఆమెను ఒప్పించి పెళ్లి చేశారు’ అని మహబూబ్‌నగర్ వన్ టౌన్ ఇన్స్‌పెక్టర్ రాజేశ్వర్ గౌడ్ చెప్పారు.

    గమనిక: ఆత్మహత్య ఆలోచన అనేది ఒక తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా మానసిక ఒత్తిడికి లోనవుతుంటే భారత ప్రభుత్వ జీవన్ సాథీ హెల్ప్ లైన్ 1800 233 3330 ద్వారా సాయం పొందవచ్చు. మీరు ఈ సమస్య గురించి మీ స్నేహితులతో, బంధువులతో కూడా మాట్లాడండి.

  20. దిల్లీలో అగ్నిప్రమాదం: ఒకే ఒక్క ఇరుకైన మెట్ల దారి.. భవనానికి ఫైర్ ఎన్ఓసీ లేదు