మహారాష్ట్ర: నవనీత్ కౌర్ దంపతులకు బెయిలు మంజూరుచేసిన కోర్టు

ఫొటో సోర్స్, GETTY IMAGES
టాలీవుడ్ మాజీ నటి, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త రవి రానాలకు ముంబయి సెషన్సు కోర్టు బుధవారం బెయిలు మంజూరుచేసింది.
శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా చదువుతానని, దమ్ముంటే తనను ఆపాలని రానా దంపతులు వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.
శాంతి, భద్రతలకు భంగం కలిగిస్తున్నారనే ఆరోపణలపై రానా దంపతులను ఏప్రిల్ 23న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
తాజాగా కొన్ని షరతులపై రానా దంపతులకు కోర్టు బెయిలు మంజూరు చేసింది.





