యూరప్ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్ చేరుకున్నారు.
రాజధాని కోపెన్హెగన్లో భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ
కార్యక్రమానికి డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్ ఫ్రెడ్రిక్సన్ కూడా హాజరయ్యారు.
‘‘నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీరు చేస్తానని అంటేనే అడుగుతాను. మీరు
తప్పనిసరిగా నా అభ్యర్థనకు అంగీకారం తెలపాలి’’అని మోదీ అన్నారు.
‘‘ఏటా ఐదురుగు విదేశీయులను మీరు భారత్ పర్యటనకు పంపించాలి’’అని మోదీ
అన్నారు. ‘‘భారత్ గురించి వారికి చెప్పండి. అక్కడ ఏమేం మంచి పర్యటక ప్రాంతాలు
ఉన్నాయో వివరించండి. భారత్లో పర్యటించాలని వారిలో స్ఫూర్తిని రగిలించండి’’అని
మోదీ అన్నారు.
‘‘మీరంతా భారత్ ప్రతినిధులు. భారత్కు విదేశీ పర్యటకులు వచ్చేలా మీరే
కృషి చేయాలి’’అని మోదీ మళ్లీ మళ్లీ చెప్పారు.
‘‘నేను విదేశీ నాయకులను కలిసినప్పుడు, అక్కడ ప్రవాస భారతీయులు చేస్తున్న
కృషిని నాకు వివరిస్తుంటారు. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంటుంది’’అని మోదీ
అన్నారు.
శ్వేత విప్లవం (వైట్ రివొల్యూషన్)లో భారత్కు డెన్మార్క్ తోడుగా
నిలిచిందని మోదీ గుర్తుచేశారు. గ్రీన్ హైడ్రోజన్, అర్బనైజేషన్, సైన్స్, టెక్నాలజీ,
ఇన్నోవేషన్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని మోదీ చెప్పారు.
జర్మనీ, డెన్మార్క్ పర్యటనల అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఫ్రాన్స్లో పర్యటిస్తారు. తాజాగా రెండోసారి ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఇమ్మానుయేల్
మెక్రాన్ను మోదీ కలవనున్నారు.