ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో బీజేపీకి భారీ మెజార్టీ, పంజాబ్‌లో ఆప్ క్లీన్‌స్వీప్

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయం నాలుగు దిక్కుల నుంచి బీజేపీకి లభించిన దీవెన అని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఫలితాల నుంచి తాము నేర్చుకుంటామని రాహుల్ గాంధీ అన్నారు. పంజాబ్‌లో 'ఆమ్ ఆద్మీ' క్లీన్ స్వీప్ చేసింది.

లైవ్ కవరేజీ

చిట్టత్తూరు హరికృష్ణ

  1. పంజాబ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన నవజ్యోత్ సింగ్ సిద్ధు

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు స్పందించారు. ‘‘ప్రజల తీర్పే.. దేవుడి తీర్పు’’అని ఆయన వ్యాఖ్యానించారు.

    తను ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నాని ఆయన చెప్పారు. ఆప్‌కు అభినందనలు తెలియజేశారు.

    పంజాబ్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆప్ మారింది. 90 నియోజకవర్గాల్లో పార్టీ ముందంజలో ఉంది. ప్రస్తుతం అధికారంలోనున్న కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

    117 మంది సభ్యులున్న అసెంబ్లీలో 59 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. పంజాబ్ ప్రజలకు అభినందనలు - కేజ్రీవాల్

    పంజాబ్‌లోని తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఎంపీ భగవంత్ మాన్‌‌తో కలిసి విజయ సంకేతం చూపిస్తున్న ఫోటోను దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

    ‘‘ప్రభంజనం చూపించిన పంజాబ్ ప్రజలకు అభినందనలు’’అని ఆయన ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు: 250కు చేరిన బీజేపీ ఆధిక్యం

    ఉత్తరప్రదేశ్

    ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం 250 మార్కును చేరుకుంది.

    ప్రస్తుతం 403 సీట్లలోని 250 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మరోవైపు రెండో స్థానంలోనున్న సమాజ్‌వాదీ పార్టీ 114 స్థానాల్లో ముందంజలో ఉంది.

    బీఎస్పీ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో ముందున్నాయి.

  4. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు: బీజేపీ కార్యకర్తల సంబరాలు

    ఉత్తర్ ప్రదేశ్
    ఉత్తరప్రదేశ్
    ఉత్తరప్రదేశ్

    ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంపై లఖ్‌నవూలోని పార్టీ కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి.

    ఫలితాల్లో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.

    250 స్థానాల్లో పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు 100 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ ముందంజలో ఉంది.

  5. కేజ్రీవాల్ మార్కు పాలనకు పంజాబ్ అవకాశం ఇచ్చింది – మనీష్ సిసోదియా

    మనీష్ సిసోదియా

    ఫొటో సోర్స్, ANI

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంపై పార్టీ నాయకుడు, దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా స్పందించారు. కేజ్రీవాల్ మార్కు పాలనకు దేశ వ్యాప్తంగా మంచి మార్కులు పడుతున్నాయని అన్నారు.

    ‘‘కేజ్రీవాల్ మార్కు పాలనకు పంజాబ్ ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. దీంతో కేజ్రీవాల్ పాలనతో అవినీతి రహిత పాలన, ఉద్యోగ కల్పన, విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ సాధ్యం అవుతుందని దేశ వ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారని రుజువైంది.’’

    ‘‘బాబా సాహెబ్, భగత్ సింగ్‌ల కలలు నేడు సాకారం అవుతున్నాయి. ఈ అభివృద్ధి నెమ్మదిగా మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తుంది.’’

    ‘‘పంజాబ్‌లో గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ కాదు. సాధారణ పౌరులు.’’

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 89 స్థానాల్లో ఆప్ ఆధిక్యం కనబరుస్తోంది. 14 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. టీవీ ట్రెండ్స్ పట్టించుకోవద్దు.. కౌంటింగ్‌పైనే దృష్టి పెట్టండి, కార్యకర్తలకు ఎస్పీ సూచన

    అఖిలేశ్

    ఫొటో సోర్స్, ani

    కౌంటింగ్ సమయంలో పార్టీ కార్యకర్తలందరూ కౌంటింగ్ ప్రక్రియలపైనే దృష్టిపెట్టాలని ఎస్పీ సూచించింది.

    ‘‘కార్యకర్తలందరూ కౌంటింగ్ కేంద్రాల దగ్గరే ఉండండి. టీవీల్లో కనిపించే ట్రెండ్స్‌ను పట్టించుకోవద్దు. ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. చివరగా ఎస్పీ కూటమికి అనుకూలంగా ఫలితాలు వస్తాయి’’అని సమాజ్‌వాదీ పార్టీ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. ఎస్పీ తుడిచిపెట్టుకుపోవడంతో చాలా సంతోషంగా ఉంది: కేశవ్ ప్రసాద్ మౌర్య

    ఉత్తర్ ప్రదేశ్

    ఫొటో సోర్స్, ANI

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ కూటమిని ప్రజలు తిరస్కరించారని సీనియర్ బీజేపీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు.

    ‘‘బీజేపీని అపఖ్యాతి పాలు చేయాలని చూసిన ఎస్పీ అబద్ధాల కోటలా మారిపోయింది’’అని ఆయన ట్వీట్ చేశారు.

    ‘‘ఎస్పీ తుడిచిపెట్టుకపోవడంతో బీజేపీ మాత్రమే కాదు.. రాష్ట్రం మొత్తం చాలా సంతోషంగా ఉంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయోత్సవాలు

    దిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, పంజాబ్‌ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌ ఇద్దరూ స్ఫురించేలా వేషం వేసుకున్న బాలుడు.

    పంజాబ్‌లో ఆప్ విజయోత్సవాల్లో ఈ బాలుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. వెనుకబడిన చన్నీ, సిద్ధు, అమరీందర్

    పంజాబ్

    ఫొటో సోర్స్, ANI

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితాల్లో ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ వెనుకబడినట్లు కనిపించారు.

    ఆయన పోటీ చేసిన రెండు స్థానాలు చామకౌర్ సాహిబ్, బదౌర్‌‌లలో ఆయన వెనుకబడ్డారు.

    మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గంలో వెనుకబడ్డారు.

    మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా పటియాలా నియోజకవర్గంలో వెనుకబడ్డారు.

    అప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్.. ధూరీ స్థానంలో ముందంజలో ఉన్నారు.

  10. ఉత్తరాఖండ్‌లో ఆధిక్యం దిశగా బీజేపీ

    ఉత్తరాఖండ్

    ఫొటో సోర్స్, bbc

    70 మంది ఎమ్మెల్యేలున్న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో బీజేపీ మెజారిటీ మార్కును చేరుకునే దిశగా వెళ్తోంది.

    ఉదయం 10.30 గంటల వరకు వెల్లడైన ఫలితాల్లో 39 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది.

    కాంగ్రెస్ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

  11. పంజాబ్

    పంజాబ్‌లో ఆప్ మెజారిటీ మార్కును దాటేసింది. 117 మంది సభ్యులున్న శాసన సభలో 85 స్థానాల్లో ఆప్‌ ఆధిక్యం కనబరుస్తోంది.

    మరోవైపు రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. 16 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

    తొమ్మిది స్థానాలతో అకాలీదళ్ మూడో స్థానంలో ఉంది.

    నలుగురు బీజేపీ అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నారు.

  12. గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెనుకంజ

    గోవా ముఖ్యమంత్రి, సాంఖ్వెలిమ్ బీజేపీ అభ్యర్థి ప్రమోద్ సావంత్ వెనుకంజలో ఉన్నారు.

    ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి 400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. మణిపూర్ ఎన్నికలు: తొలి ఫలితాల్లో బీజేపీ ముందంజ

    మణిపూర్

    మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ ఆరు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా.. ఇతరులు ఐదు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు.

    మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

  14. పంజాబ్ ఎన్నికలు: తొలి ఫలితాల్లో ఆప్ ముందంజ

    పంజాబ్

    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితాల్లో ఆప్ ముందంజలో ఉంది. ఆప్ 30 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా.. అకాలీదళ్ ఐదు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.

    మరోవైపు కాంగ్రెస్ ఏడు స్థానాల్లో బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉంది.

  15. యూపీ ఎన్నికలు: ఆధిక్యంలోకి బీజేపీ

    ఉత్తర్ ప్రదేశ్

    ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. 16 సీట్లతో పార్టీ మొదటి స్థానంలో ఉండగా.. ఎనిమిది స్థానాలతో ఎస్పీ రెండో స్థానంలో ఉంది.

    బీఎస్పీ ఒక స్థానంలో ముందంజలో ఉంది.

  16. బీజేపీ, ఎస్పీ హోరాహోరీ

    ఉత్తర్ ప్రదేశ్
    ఫొటో క్యాప్షన్, ఉత్తర్ ప్రదేశ్

    ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మొదలవుతూనే బీజేపీ, ఎస్పీ హోరాహోరీ తలపడుతున్నట్లు కనిపించాయి.

    ఉదయం 8.45 నిమిషాలకు 4 సీట్లతో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ముందుంది. 3 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉంది.

  17. కౌంటింగ్‌కు ముందుగా గుడికి వెళ్లిన గోవా సీఎం

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    గోవాలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ మొదలైంది.

    గురువారం ఉదయం కౌంటింగ్‌కు ముందుగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గోవాలోని శ్రీ దత్త దేవాలయాన్ని సందర్శించారు.

  18. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు: ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్...., కౌంటింగ్ హాల్స్ పరిసరాల్లో 144 సెక్షన్‌

    అసెంబ్లీ ఎన్నికలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, అసెంబ్లీ ఎన్నికలు

    దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.

    ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. 8:30 గంటల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం)ని ఓట్లను లెక్కిస్తారు.

    ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 672 మంది కౌంటింగ్ పర్యవేక్షకులు, 130 మంది పోలీసు అబ్జర్వర్లు, 10 మంది ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేసింది. వీరంతా లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తుంటారు.

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్, వారణాసి నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలను నిరోధించడానికి ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది.

    ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లపై కేంద్ర భద్రతా దళాలతో మూడు దశల పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది.

    ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించడానికి కౌంటింగ్ హాల్స్ పరిసరాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.

    ప్రతీ రౌండ్ కౌంటింగ్ అనంతరం ఫలితాలను విడుదల చేస్తుంటారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలను కూడా ఇదే విధంగా ప్రకటిస్తారు.

    ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరిగాయి.

    ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరగగా, అస్సాంలోని మజూలీ నియోజకవర్గం ఉపఎన్నికల ఫలితాలను కూడా వీటితో పాటే ప్రకటించనున్నారు.

    తాజాగా ఎన్నికలు జరిగిన ఈ 5 రాష్ట్రాల్లో 4 బీజేపీ పాలిత రాష్ట్రాలు కాగా, పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది.

  19. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల బీబీసీ లైవ్ పేజికి స్వాగతం

    అయిదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభమవుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను బీబీసీ తెలుగు మీకు ఈ లైవ్ పేజీలో ఎప్పటికప్పుడు నివేదిస్తోంది.

    దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలను అప్డేట్స్ మినట్ బై మినట్ మీరిక్కడ చూడవచ్చు.