బడ్జెట్ 2021: ఆ నాలుగు రాష్ట్రాలకే నిధులు ఎందుకు? ఆంధ్రా, బిహార్‌లకు ఎందుకు ఇవ్వలేదు? - కాంగ్రెస్ ప్రశ్న

రహదారులు, మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం తమిళనాడుకు రూ.1.03 లక్షల కోట్లు, కేరళకు రూ.65 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.25 వేల కోట్లు, అసోంకు 19 వేల కోట్ల రూపాయలను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

లైవ్ కవరేజీ

  1. వందకు పైగా దేశాలకు కోవిడ్-19 సురక్షా కవచం

    కోవిడ్ వ్యాక్సీన్ గురించి మాట్లాడిన నిర్మలా సీతారామన్ భారత ప్రభుత్వం కేవలం భారత పౌరులకే కాదు, మరో వంద దేశాల ప్రజలకు కోవిడ్-19 నుంచి ఉపశమనం అందిస్తోందని చెప్పారు.

    "భారత్ దగ్గర ప్రస్తుతం రెండు వ్యాక్సీన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయంతో భారత పౌరులకు సురక్షా కవచం అందించడం ప్రారంభించాం. దానితోపాటూ వందకు పైగా దేశాలకు కూడా కోవిడ్ 19 నుంచి రక్షణ అందించడం ప్రారంభించాం. త్వరలోనే మిగతా వ్యాక్సీన్లు కూడా అందుబాటులోకి వస్తాయని తెలియడం ఉపశమనం కలిగిస్తోంది" అని నిర్మలా సీతారామన్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. ఆత్మనిర్భర్ ప్యాకేజీలు సంస్కరణల వేగాన్ని పెంచాయి

    ప్రభుత్వం అత్యంత సున్నితమైన వర్గాలకు అండగా నిలిచేందుకు పీఎంజీకేవై, మూడు ఆత్మనిర్భర ప్యాకేజీలు, తర్వాత చేసిన ప్రకటలు స్వయంగా ఐదు మినీ బడ్జెట్లకు సమానం అని ఆర్థిక మంత్రి చెప్పారు.

    ఆత్మనిర్భర్ ప్యాకేజీలు నిర్మాణాత్మక సంస్కరణల మన వేగాన్ని పెంచాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.

  3. బీబీసీ బడ్జెట్-2021 లైవ్ పేజీకి స్వాగతం.. పార్లమెంటుకు చేరుకున్న ఆర్థిక మంత్రి

    నిర్మలా సీతారామన్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి పార్లమెంటుకు చేరుకున్న ఆర్థిక మంత్రి

    నమస్కారం. బీబీసీ ప్రత్యేక బడ్జెట్ పేజీకి స్వాగతం.

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంట్‌లో 2021-2022 బడ్జెట్ ప్రవేశపెడతారు.

    బడ్జెట్‌కు సంబంధించిన తాజా నమాచారం కోసం ఈ లైవ్ పేజీని ఎప్పటికప్పుడు రెఫ్రెష్ చేస్తుండండి.

    ఫిబ్రవరి 1న అంటే ఈరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని రోజుల మందే యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ఆవిష్కరించారు. ఇందులో బడ్జెట్‌కు సంబంధించిన అన్ని పత్రాలూ డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి.

    ఆర్థికమంత్రి లోక్‌సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇది ఆమెకు మూడో బడ్జెట్ అవుతుంది. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత ఇది దేశ మొదటి కేంద్ర బడ్జెట్ అవుతుంది. ఈ బడ్జెట్‌ను కోవిడ్ వల్ల విధించిన లాక్‌డౌన్ ప్రభావాన్ని తగ్గించడానికి లేదా దూరం చేసే ఒక ప్రయత్నంగా చూస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందే చెప్పారు.

    అంతకుముందు ఆర్థిక మంత్రి శుక్రవారం గత ఆర్థిక సంవత్సరం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. అందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 11 శాతం ఉండచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు.