ప్రధాన అభ్యర్థుల పరిస్థితి ఏమిటి?
ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ (రఘోపుర్), ఆయన అన్నయ్య తేజ్ ప్రతాప్(హసన్పుర్)ల ఆధిక్యం కొనసాగుతోంది.
ఆర్జేడీ నాయకుడు అనంత్ సింగ్, హిందుస్తాన్ అవామీ మోర్చా నాయకుడు జీతన్ రామ్ మాంఝీ కూడా తమ తమ నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. మరోవైపు శతృఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా.. బంకీపుర్ నియోజకవర్గంలో వెనుకపడ్డారు.
జేడీయూ మాజీ నాయకుడు శరద్ యాదవ్ కుమార్తె, కాంగ్రెస్ అభ్యర్థి సుభాషిణి.. బిహారీ గంజ్ స్థానంలో వెనుకపడ్డారు.