కరోనా వైరస్: 24 గంటల్లో 525 కొత్త కేసులు.. భారత్లో 3,072కి పెరిగిన పాజిటివ్ కేసులు
కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 11 లక్షలు దాటిన వైరస్ బాధితులు. 58 వేలు దాటిన మృతులు. అమెరికాలో 3 లక్షలకు చేరుకుంటున్న కోవిడ్ పేషెంట్ల సంఖ్య, మాస్క్ పెట్టుకోనంటున్న ట్రంప్.
లైవ్ కవరేజీ
ఏపీలో 192కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 192కి చేరింది.
తెలంగాణలో మొత్తం 272కి చేరిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 272కి పెరిగాయని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
శనివారం ఒకరిని డిశ్చార్జి చేయడంతో మొత్తం ౩౩ మంది మందిని డిశ్చార్జి చేసినట్టయిందని.. శనివారం కొత్తగా 43 కేసులు నమోదుకాగా మరణాలేమీ లేవని చెప్పారు.
డిశ్చార్జయినవారు, మృతులను మినహాయించగా ప్రస్తుతం 228 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయని. ప్రస్తుతం పాజిటివ్ లు అన్నీ మర్కజ్ నుంచి వచ్చిన వారూ, వారిని కలసిన వారివేనని అన్నారు. షాద్ నగర్, సికిందరాబాదుల్లో చనిపోయిన వారు కడూ దిల్లీ నుంచి వచ్చిన వారిని కలిసిన వారేనని చెప్పారు. 1090 మంది దిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చారు..వారందర్నీ పరీక్షిస్తున్నాం అన్నారు ఈటల రాజేందర్.
ర్యాపిడ్ యాంటీబాడీ బేస్డ్ బ్లడ్ టెస్టులు వెంటనే ప్రారంభించండి: ఐసీఎంఆర్
కరోనా క్లస్టర్ జోన్లు, వలస కేంద్రాల్లో వెంటనే ర్యాపిడ్ యాంటీబాడీ బేస్డ్ బ్లడ్ టెస్టులు నిర్వహించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సూచించింది. ఇందుకోసం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ట్రంప్తో ఫోన్లో మాట్లాడా.. కలసికట్టుగా కరోనాను ఎదుర్కొంటాం: ప్రధాని మోదీ
కరోనావైరస్పై కలసికట్టుగా పోరాడేందుకు భారత్, అమెరికాలు నిర్ణయించాయని.. తమ పూర్తి శక్తిసామర్థ్యాలను వినియోగిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్తో ఫోన్లో సంభాషించానని మోదీ వెల్లడించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
24 గంటల్లో 525 కొత్త కేసులు.. భారత్లో 3,072కి పెరిగిన పాజిటివ్ కేసులు
భారత్లో కరోనావైరస్ కేసులు భారీగా పెరిగాయి.
గత 24 గంటల్లో ఏకంగా 525 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
దీంతో దేశవ్యాప్తంగా కరోనావైరస్ సోకినవారి సంఖ్య 3,072కి పెరిగింది. మృతుల సంఖ్య 75కి పెరిగింది.
213 మందికి వ్యాధి నయమై ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారు.
ప్రస్తుతం దేశంలో 2,784 యాక్టివ్ కేసులుండగా అందరూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మోదీ పిలుపును పాటించాలంటూ తెలుగు సినీ హీరోల వీడియో సందేశాలు
ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంలకు ప్రజలంతా ఇళ్లలో విద్యుత్ దీపాలు ఆర్పివేసి బయట కొవ్వొత్తులు వెలిగించాలంటూ తెలుగు సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా కోరారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పోస్ట్ X స్కిప్ చేయండి, 3X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘నేనే సాక్ష్యం.. కరోనావైరస్ సోకినా బయటపడొచ్చు’’
కరోనావైరస్ సోకి విజయవాడ జీజీహెచ్లో చికిత్స పొంది ఆరోగ్యంగా బయటపడిన 21 ఏళ్ల యువకుడు వైద్యులకు సహకరిస్తే ఈ వైరస్ నుంచి బయటపడొచ్చని చెప్పారు. ‘‘నేను విద్యార్థిని. పారిస్ నుంచి మార్చి 16న దిల్లీ వచ్చాను. అక్కడ వైద్య పరీక్షల తరువాత 17న విమానంలో హైదరాబాద్ వచ్చి, అక్కడి నుంచి ప్రయివేట్ క్యాబ్లో విజయవాడ వచ్చాను. మున్సిపల్ సిబ్బంది మా ఇంటికొచ్చి 14 రోజులు ఐసోలేషన్లో ఉండమన్నారు. ఐసోలేషన్లో ఉండగానే జ్వరం రావడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సంప్రదించాను. వెంటనే నన్ను విజయవాడ జిజిహెచ్ లో కరోనా ఐసోలేషన్ వార్డులో చేర్చి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తెలిసింది. దాంతో నా కుటుంబ సభ్యులను కూడా హాస్పిటల్ క్వారంటైన్ కు తరలించి టెస్ట్ చేసారు. వారికి నెగెటివ్ వచ్చింది. ఇక్కడి డాక్టర్లు చికిత్స చేశారు. క్రమం తప్పకుండా టెస్టులు చేయగా రెండుసార్లు కరోనా నెగటివ్ రావడంతో ఈ రోజు డిశ్చార్జి చేశారు. సోషల్ మీడియాలో మా కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయడం బాధ కలిగించింది. డాక్టర్ల సూచనలు పాటిస్తే కరోనావైరస్ సోకినా బయటపడొచ్చు.. అందుకు నేనే ఉదాహరణ’’ అన్నారు.

ఫొటో సోర్స్, IandPR andhrapradesh
లాక్డౌన్ ఉల్లంఘించినవారితో యోగాసనాలు
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారితో కర్ణాటక పోలీసులు యోగాసనాలు వేయించారు.
కొందరితో గుంజీలు తీయించారు.
అనంతరం వారందరికీ కొవ్వొత్తులు చేతికిచ్చి ఆదివారం రాత్రి 9 గంటలకు వాటిని వెలిగించి ఇంటి బయట నిల్చోమని చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఏపిలో 190 కి పెరిగిన కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. మొత్తం 190 కేసులు నమోదయ్యాయి.
కృష్ణా జిల్లాలో 5, గుంటూరు 3, అనంతపూర్, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.
కరోనాకు మతం రంగు పులమొద్దు: ఏపీ సీఎం జగన్
చీకటిని నింపుతున్న కరోనాను తరమడానికి దీపాలు వెలిగించాలన్న ప్రధాని పిలుపును విజయవంతం చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం విడుదల చేసిన వీడియో సందేశంలో చెప్పారు.
రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులను ఏ ఒక్క మతానికో పులమొద్దని.. అందరూ కలసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలని కోరారు.
కరోనా కాటుకు కులాలు, మతాలు, ప్రాంతాలు, పేద, ధనిక బేధాలు లేవు.
కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు భారతీయులమంతా ఏకతాటిపై నిలవాలని ఏపీ సీఎం జగన్ అన్నారు.
వారికి పూర్తి జీతాలు: ఏపీ సీఎం జగన్
లాక్డౌన్ నిబంధనలను ఎవరూ అతిక్రమించవద్దని జగన్ సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వాయిదా వేస్తున్నప్పటికీ కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచి విధులు నిర్వహించే పోలీసు, వైద్య, పారిశుద్ధ్య, పలు ఇతర విభాగాల ఉద్యోగులకు జీతాలు పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, YSJaganmohanreddy/facebook
ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి సత్యసాయి ట్రస్ట్ రూ. 5 కోట్ల విరాళం
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 కోట్లు విరాళం అందజేసింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ చెక్ అందజేశారు.
స్పెయిన్లో మరో 809 మంది మృతి.. 11,744కి పెరిగిన మృతుల సంఖ్య
స్పెయిన్లో మరో 809 మంది కరోనావైరస్ రోగులు మరణించారు.
దీంతో మరణాల సంఖ్య 11,744కి పెరిగింది. ఇప్పటివరకు స్పెయిన్లో 1,24,736 మందికి ఈ వైరస్ సోకింది.
కరోనా రోగి తుమ్మితే ఆ వైరస్ ఎంత దూరం వెళ్తుందో తెలుసా
ఒక కరోనా బాధితుడు తుమ్మితే ఆ వైరస్ ఎంత దూరం వెళ్తుందో శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ తుంపర్లు మనం అనుకున్న దానికన్నా ఎక్కువ దూరమే ప్రయాణిస్తున్నాయి.
ఆ వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి చూడండి.
ఇంట్లో లైట్లే ఆపండి.. వీధి దీపాలు ఆపొద్దు: కేంద్ర ఇంధన శాఖ
దేశ ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు తమ ఇళ్లలో దీపాలు ఆర్పివేసి బాల్కనీలు, గుమ్మాల్లో నుంచుని 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు కానీ, ఇంకేవైనా దీపాలు కానీ వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో కేంద్రం కొన్ని సూచనలు చేసింది.
ఒక్కసారిగా విద్యుత్ వినియోగం తగ్గిపోయి గ్రిడ్లపై ప్రభావం పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. ఇళ్లలోని లైట్లు మాత్రమే ఆపాలని, ఇతర విద్యుత్ పరికరాలు ఆపాల్సిన అవసరం లేదని చెప్పింది.
అలాగే, వీధి దీపాలు, అత్యవసర ప్రాంతాలు, ఆసుపత్రుల్లో విద్యుద్దీపాలు ఆపొద్దని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
17 రాష్ట్రాల్లో తబ్లిగీ జమాత్తో సంబంధమున్న కరోనా పాజిటివ్ కేసులు
ఇండియాలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్ల 1023 తబ్లిగీ జమాత్తో సంబంధమున్నవేనని.. 17 రాష్ట్రాల్లో వీరిని గుర్తించామని లవ్ అగర్వాల్ చెప్పారు.
దేశంలోని మొత్తం కేసుల్లో 30 శాతం ఒకే ప్రాంతంతో సంబంధం ఉన్నవని ఆయన చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇండియాలో ఇప్పటివరకు 2,902 కేసులు.. 68 మరణాలు
భారత్లో ఇప్పటివరకు 2,902 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
‘‘శుక్రవారం నుంచి కొత్తగా 601 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఈ వైరస్ బాధితుల్లో 12 మంది మరణించడంతో మొత్తం ఇంతవరకు చనిపోయినవారి సంఖ్య 68కి చేరింది.
ఈ వైరస్ సోకినవారిలో ఇంతవరకు 183 మంది కోలుకున్నార’’ని చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రధాని మోదీ పిలుపును విజయవంతం చేద్దాం: రాంచరణ్
లాక్డౌన్ పాటిస్తున్నట్లే అంతా అదే స్ఫూర్తితో ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలని సినీ నటుడు రాంచరణ్ కోరారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కరోనావైరస్: కోవిడ్-19 మృతులకు నివాళిగా 3 నిమిషాల మౌనం పాటించిన చైనా
కరోనావైరస్ కారణంగా మృతి చెందిన వారికి నివాళులర్పించింది చైనా. ఈరోజు ఉదయం పదిగంటలకు మూడు నిమిషాల పాటు దేశం మొత్తం స్తంభించిపోయింది. కోవిడ్-19 కారణంగా మరణించిన 3,300 మంది మృతులకు నివాళిగా యావత్ దేశ ప్రజలు మౌనం పాటించారు.
కార్లు, రైళ్లు, షిప్లు హారన్లను మోగించగా, దేశ వ్యాప్తంగా సైరన్లను కూడా మోగించారు. అలాగే జాతీయ జెండాను సగం వరకు దించి మృతుల పట్ల తమ సంతాపాన్ని తెలియజేశారు.
హూబే ప్రావిన్స్ లోని వూహాన్లో గత ఏడాది తొలిసారిగా ఈ వైరస్ బయట పడింది. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి విస్తరించింది.
వూహాన్లో సరిగ్గా ఉదయం 10 గంటలకునగర పరిధిలోని అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద 3 నిమిషాల పాటు రెడ్ లైట్లు వెలిగాయి. కరోనాపై పోరాటంలో ప్రాణాలు వదిలిన 14 మంది వైద్య సిబ్బందికి కూడా ఈ కార్యక్రమం ద్వారానివాళలర్పించినట్టయ్యిందని చైనా అధికార వర్గాలు తెలిపాయి.
మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా మృతులకు సంతాప సూచకంగా కోటుపై తెల్లని పూలు ధరించి 3 నిమిషాల సేపు మౌనం పాటించారు.

ఫొటో సోర్స్, EPA
ఇండియన్ ఆర్మీ కీలక సూచన
ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు కొవ్వొత్తులో, ఇతర దీపాలో వెలిగించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో భారత సైన్యం ఒక ముఖ్యమైన సూచించింది.
ప్రజలు కొవ్వొత్తులు వెలిగించే ముందు చేతులు కడుక్కుంటే సబ్బుతో కడుక్కోవాలని.. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకున్నాక కొవ్వొత్తులు వెలిగించొద్దని చెప్పింది.
ఆల్కహాల్కు మండే స్వభావం ఉండడంతో భారత సైన్యం ప్రజలకు ఈ మేరకు జాగ్రత్త చెప్పింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
