Cryonics: ‘నా తల్లి చనిపోయింది.. మైనస్ 196°C వద్ద వందేళ్లు భద్రం చేస్తా.. ఆమె మళ్లీ బతికొస్తుంది..’

ప్రచురణ

దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జంగ్ కిల్.. తన తల్లి మృతదేహాన్ని మైనస్ 196 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రం చేశారు.

వందేళ్ల పాటు మృతదేహాన్ని భద్ర పరిచే ఒక సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు.

భవిష్యత్తులో మరణించిన వారిని కూడా సైన్స్ బ్రతికించగలదు అనే నమ్మకంతో ఈయన ఇలా చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 600 మృతదేహాలను క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రం చేశారు.

క్రయానిక్స్ అంటే ఏమిటి?

మరణించిన వారి శరీరం, మెదడు పాడవకుండా వాళ్ల శరీరాలను ఫ్రీజ్ చేసి భద్రపరచడమే క్రయానిక్స్.

పేషెంట్ ఏ కారణంతో అయితే చనిపోయాడో, భవిష్యత్తులో మెడికల్ సైన్స్ దానికి పరిష్కారాన్ని కనుగొని, వాళ్లను తిరిగి బతికించడానికి క్రయానిక్స్ ఉపయోగపడుతుందని క్రయానిక్స్ టెక్నీషియన్స్ అంటున్నారు.

మనిషి మరణించగానే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కొత్త జ్ఞాపకాలు ఉండవు. దీంతో మెదడులోని కణాలు మరణించడం ప్రారంభం అవుతుంది.

సరిగ్గా అప్పడే క్రయానిక్స్ టెక్నీషియన్ పని మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చట్టబద్ధంగా మరణించాడని ప్రకటిస్తారో, శరీరం పాడవడాన్ని అరికట్టడానికి శరీరానికి ఐస్ బాత్ చేయించాలి.

ఆ తర్వాత శరీరంలోని రక్తం మొత్తం తొలగించి, దాని స్థానంలో క్రయోప్రొటెక్టెంట్ ఏజెంట్లను నింపుతారు.

ఆ తర్వాత శరీరాన్ని ఒక స్టోరేజ్ ట్యాంకులో పెట్టి, లిక్విడ్ నైట్రోజన్ ద్వారా దాని ఉష్ణోగ్రతను మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)