పాలస్తీనాలో పెరుగుతున్న ఆత్మహత్యలు.. కారణమేంటి

ప్రచురణ

పాలస్తీనా యువకుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 30 మందికిపైగా సూసైడ్ చేసుకున్నారు.

సుదీర్ఘకాలంగా ఇజ్రాయెల్ దాడులు, ఈజిప్ట్ దిగ్బంధం, పేదరికాల వల్ల ఈ ప్రాంతంలో యువతలో నిర్వేదం పెరుగుతోందని పాలస్తీనా మానవహక్కుల గ్రూపులు అంటున్నాయి.

హమాస్ పాలనలో భావప్రకటనా స్వేచ్ఛ లేకపోవడం కూడా ఇందుకు కారణమని చెబుతున్నాయి.

గజా ఇస్లామిక్ సమాజంలో ఆత్మహత్య చేసుకోవడాన్ని పాపంగా భావిస్తారు. అయినా సూసైడ్ కేసులు పెరుగుతున్నట్లుగా మానవహక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 30 మందికిపైగా చనిపోగా, ఆరు వందలకు పైగా ఆత్మహత్య ప్రయత్నాలు జరిగాయి.

బీబీసీ ప్రతినిధి యోలాండె నెల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)