భార్యను చంపడానికి ఎంతకు తెగించాడంటే..

ప్రచురణ

నాగుపాముతో కాటు వేయించి, భార్యను చంపినందుకు గానూ ఓ వ్యక్తికి 'రెండు జీవితఖైదులు' శిక్షను గతవారం విధించారు.

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన నాగుపాము కోసం, 28 ఏళ్ల సూరజ్ కుమార్, గతేడాది ఏప్రిల్ నెలలో రూ. 7000 చెల్లించారు.

భారత్‌లో పాములతో వ్యాపారం చేయడం చట్టవిరుద్ధం. కాబట్టి పాములను పట్టుకునే కేరళకు చెందిన సురేశ్ కుమార్ నుంచి రహస్యంగా సూరజ్ పామును కొనుగోలు చేశారు.

ప్లాస్టిక్ కంటైనర్‌లో పామును ఉంచి దాన్ని తన ఇంటికి తీసుకెళ్లారు. గాలి ఆడటం కోసం కంటైనర్‌కు ఒక రంధ్రాన్ని చేశారు.

13 రోజుల తర్వాత సూరజ్, పాము ఉన్న కంటైనర్‌ను బ్యాగ్‌లో పెట్టుకొని 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన అత్తవారింటికి వెళ్లారు.

... ఆ తరువాత సూరజ్ ఆ పాముతో ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)