అవయవ దానం: ‘‘నాకో శవాన్ని ఇవ్వండి చాలు.. నలుగుర్ని బతికిస్తా’’

ప్రచురణ

చనిపోయాక కూడా ఎలా బతికి ఉండొచ్చో చెప్తున్నారు ఉపాధ్యాయురాలు గూడూరు సీతామహాలక్ష్మి.

అఖిల భారత అవయవ, శరీర దాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు ఈమె.

''మనం మరణం ద్వారా కూడా మహోపకారం చేయగలం. మరణాన్ని కూడా చిరస్మరణీయం చేయగలం'' అంటారామె.

''చనిపోతూ వేరేవారికి ప్రాణం పోస్తున్న వారు.. ఒక రకంగా చెప్పాలంటే మన మధ్య జీవించే ఉన్నారు'' అని చెప్పారు.

అవయవదానం గురించి దేశ వ్యాప్తంగా చైతన్యం నింపుతున్న ఈ టీచర్ తన శరీరాన్ని కూడా దానం చేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)