‘టీడీపీ హయాంలో గీతం యూనివర్శిటీ 40 ఎకరాలు ఆక్రమించింది’ - విశాఖపట్నం ఆర్డీఓ నివేదిక.. పలు అక్రమ నిర్మాణాల కూల్చివేత

ప్రచురణ

గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాలు నిర్మించిందంటూ.. జీవీఎంసీ అధికారులు కొన్నింటిని తొలగించారు. గీతం వర్సిటీ ప్రధాన ద్వారాన్ని, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ రూములను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు.

రుషికొండ, ఎండాడ పరిసరాల్లో భూ ఆక్రమణలు జరిగాయని, గీతం యూనివర్శిటీ 40.51 ఏకరాలను కలుపుకుందని అధికారులు చెబుతున్నారు.

గీతం విద్యా సంస్థల భూ ఆక్రమణలపై ప్రభుత్వనికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం నివేదిక ఇచ్చింది.

రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో 40.51 ఎకరాల భూములు గీతం విశ్వవిద్యాలయం ఆక్రమణల్లో ఉన్నాయంటూ ఆర్టీవో పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయం సమీపంలోని భూముల్ని గీతం యాజమాన్యం ఆక్రమించినట్లు అధికారులు నిర్ధరించారు.

ఎండాడలోని సర్వే నం. 15(పీ) 16(పీ),17పీ, 18పీ, 18పీ, 20వీ, రుషికొండలోని 553, 613, 34, 35, 37, 38లోని మొత్తం 40.51 ఎకరాల భూమిని గీతం విద్యా సంస్థలు ఆక్రమించినట్లు రెవెన్యూ యంత్రాంగం నివేదికలో పేర్కొంది.

ఈ ఆక్రమణలపై విశాఖ ఆర్టీవో పెంచల్ కిశోర్ ఇచ్చిన నివేదికతో పాటు సిట్ తమకు అందిన ఫిర్యాదు నంబర్ 2670 ప్రకారం విచారణ జరిపింది.

కాగా, తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూలగొడతారని గీతం ప్రతినిధులు ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)