పదమూడేళ్లుగా పక్షులతో అనుబంధం

ప్రచురణ

నగరాలన్నీ భారీ భవనాలతో కాంక్రీట్ జంగిల్స్‌గా మారిపోయాయి.

దీంతో పక్షులు, వాటి కిలకిలరావాలు వినిపించడమే తగ్గిపోయింది. ఎక్కడైనా ఓ పిచ్చుకో, చిలకో కనిపిస్తేనే.. చాలా మంది ఎంతో సంతోషపడిపోతున్నారు.

విశాఖపట్నానికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి ఇంటికి మాత్రం రోజూ... వందల రామచిలుకలు, పావురాలు వచ్చి సందడి చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా లక్ష్మీనారాయణ రెడ్డి తన ఇంటి మేడపై కొన్ని మొక్కలను పెంచుతున్నారు.

ఆ మొక్కల కారణంగానే ఆయనకు రామచిలుకలు, పావురాలతో 13 ఏళ్లుగా విడదీయరాని అనుబంధం ఏర్పడింది.

మొదట్లో ఆ మొక్కల దగ్గరకు వచ్చిన రెండు, మూడు చిలుకలకు కొన్ని బియ్యం గింజలు వేసేవారు లక్ష్మీనారాయణ. కొన్ని రోజులకు చిలుకలు గుంపుగా రావడం మొదలైంది...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)