పారిశుధ్య కార్మికుడిగా పనిచేసే ఓ యువకుడికి లాంకస్టర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌షిప్

పారిశుధ్య కార్మికుడిగా పనిచేసే ఓ యువకుడికి లాంకస్టర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌షిప్
ప్రచురణ

మయూర్ హేలియా పన్నెండేళ్ల పాటు ముంబయి మునిసిపల్ కార్పొరేషన్‌లో గార్బేజ్ లోడర్‌, అంటే చెత్తను బండ్లలోకి ఎత్తే పని చేశారు.

కానీ ఇకపై అతడి జీవితం పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. బ్రిటన్‌లోని లాంకస్టర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు ఆయనకు స్కాలర్‌షిప్ లభించింది. ఆయన పట్టుదలే ఆయనను ఇక్కడికి చేర్చింది.

మయూర్ తండ్రి ముంబయి మునిసిపల్ కార్పొరేషన్‌లో స్వీపర్‌గా పని చేసేవారు. ఆయన చనిపోయేటప్పటికి మయూర్‌కి కేవలం పద్దెనిమిదేళ్లే.

ఆయనకు తల్లీ, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. మయూర్‌కు చదవాలని ఉన్నప్పటికీ, కుటుంబం పరిస్థితిని చూసి తనకు దక్కిన తండ్రి ఉద్యోగాన్ని చేపట్టారు.

పూర్తి వివరాలకు పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)