"మా కుటుంబంలో ఎంత మందికి కరోనావైరస్ సోకింది? నేను మళ్ళీ మా ఆయనను చూడగలనా?"
“నాకు ఆ సమయంలో ఏం చేయాలో అర్థంకాలేదు. నేను దాదాపుగా కుప్పకూలిపోయాను. మా ఆయన్ను మళ్లీ చూడగలుగుతానా? మా కుటుంబంలో ఎంత మందికి కరోనావైరస్ సోకింది? ఒక్కోరోజు మా ఇంట్లో తెల్లవారుజామున 3.30 వరకు అందరమూ చిన్నచిన్న గేమ్స్ ఆడుకునేవాళ్లం. అవన్నీ మళ్లీ చూడగలనా అనిపించింది” అని అన్నారు నెహాలి పవార్.
18 మంది ఉండే ఈ ఉమ్మడి కుటుంబం ముంబయిలోని వాడాల పరిసరాల్లో నివసిస్తుంది. చుట్టుపక్కల అంతా గుడిసెలు, కిక్కిరిసిన వీధులు ఉన్నప్పటికీ వీరి ఇంట్లో తొమ్మిది గదులున్నాయి.
“ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం భారిన పడ్డారు. ఒకరు దగ్గుతుంటే మరొకరు తుమ్ముతున్నారు. ఒక్కసారిగా చాలా భయమేసింది”అంటూ తన కుటుంబం మొత్తానికి ఎలా కరోనావైరస్ సోకిందో ఆమె బీబీసీకి వివరించారు.
లాక్డౌన్ సమయంలో అందరిలానే ఈ కుటుంబంలోని వారు కూడా ఇంటికే పరిమితమయ్యారు. కొత్త వంటకాలు, ఆటలు, పాటలతో ఇల్లంతా సందడిగా మారింది. అయితే, నెల తిరిగేలోగా ఈ సంతోషానికి కరోనావైరస్తో ముగింపు పడింది. అదృష్టవశాత్తు పవార్ కుటుంబం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)