మార్చి 4 వరకు మనీష్ సిసోడియాకు సీబీఐ కస్టడీ, పలుచోట్ల ఆప్ కార్యకర్తల ఆందోళనలు

మద్యం పాలసీ కేసులో అరెస్టయిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది రూస్ అవెన్యూ కోర్టు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.

  2. ‘అదానీ వ్యవహారం నుంచి దారి మళ్లించడానికే మనీష్ సిసోడియా అరెస్ట్’

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

    ఫొటో సోర్స్, KCR/Facebook

    దిల్లీ లిక్కర్ ‘స్కాం’ కేసులో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించారు.

    ‘అదానీ, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ఉన్న సంబంధాల నుంచి ప్రజలను దారి మళ్లించడానికి చేసిన పని తప్ప మరొకటి కాదు’ అని కేసీఆర్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. పాటియాల యూనివర్సిటీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ... ఒక విద్యార్థి మృతి

    పంజాబ్‌లోని పాటియాల యూనివర్సిటీలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి చనిపోయినట్లు పాటియాల డిఎస్‌పీ జస్వీందర్ సింగ్ తెలిపారు. మరో ఇద్దరు గాయపడినట్లు వెల్లడించారు.

    బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న నవజోత్ సింగ్ అనే విద్యార్థిని కత్తితో పొడిచినట్లు పోలీసులు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. ప్రీతి: ‘కరోనా‌ను ఎదిరించి గెలిచింది కానీ... వేధింపులను తట్టుకుని నిలబడలేక పోయింది’

  5. ఈ రైతు 5 క్వింటాల ఉల్లి అమ్మితే రూ.2 మిగిలాయి

  6. 1 రూపాయి 30 రోజుల్లో రూ.53 కోట్లు ఎలా అవుతుంది...చక్రవడ్డీ మిమ్మల్ని ఎట్లా ధనవంతుల్ని చేస్తుంది?

  7. దిల్లీ మద్యం పాలసీ కేసు: 5 రోజుల సీబీఐ కస్టడీకి మనీష్ సిసోడియా

    మనీష్ సిసోడియా

    ఫొటో సోర్స్, ANI

    మద్యం పాలసీ కేసులో ఆదివారం నాడు అరెస్టయిన దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది రూస్ అవెన్యూ కోర్టు.

    మార్చి 4వ తేదీ వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉంటారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    అంతకు ముందు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ మనీష్ సిసోడియాను కోర్టులో హాజరుపరిచారు.

    మనీష్ సిసోడియా

    ఫొటో సోర్స్, Subrata Kumar Pati

    మరోవైపు సిసోడియా అరెస్ట్‌కు వ్యతిరేకంగా దేశలోని పలు ప్రాంతాలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.

  8. ఉత్తర కొరియా- కిమ్ జోంగ్ ఉన్: మిలిటరీ గొప్పలు, ప్రచార యావ ప్రజలను ఆకలి చావులవైపు నడిపిస్తున్నాయా?

  9. చైనా ఇచ్చిన అప్పులే పాకిస్తాన్‌ను పేదరికంలోకి నెడుతున్నాయా?

  10. వుమెన్స్ టీ20 వరల్డ్ కప్: ఆహా! అనిపించేలా ఆడిన 10 మంది క్రికెటర్లు ఎవరంటే..

  11. కొంగ స్నేహం: రక్షించిన వ్యక్తిని విడిచి వెళ్లని పక్షిరాజం

  12. వజ్రం ప్రాణం తీస్తుందా... శాపగ్రస్త వజ్రాలుంటాయా? అత్యంత విలువైన 5 వజ్రాల కథలివే

  13. కర్ణాటక: శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

    శివమొగ్గ విమానాశ్రయం

    ఫొటో సోర్స్, BJP

    కర్ణాటకలో కొత్తగా నిర్మించిన శివమొగ్గ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు.

    అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.

    ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ బి.ఎస్.యడ్యూరప్ప కూడా పాల్గొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. విశాఖపట్నం: భక్తులతో మాట్లాడే రోబో సాయిబాబా

  15. కూనో అభయారణ్యం: గిర్ సింహాల కోసం సిద్ధం చేసిన ఆవాసంలో ఆఫ్రికా చీతాల నివాసం.. నిర్వాసితులైన ఆదివాసీ జనం

  16. నలంద విశ్వవిద్యాలయం: ప్రపంచాన్ని మార్చేసిన ప్రాచీన భారతీయ యూనివర్సిటీ విశిష్టత ఏమిటి? ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ కన్నా 500 ఏళ్ల ముందు నుంచే ఉన్న నలందను ధ్వంసం చేసింది ఎవరు?

  17. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ

    నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు

    ఫొటో సోర్స్, ANI

    మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. రెండు రాష్ట్రాల్లోనూ సాయత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది.

    రెండు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున శాసనసభ స్థానాలు ఉన్నాయి.

    అయితే మేఘాలయలో యూడీపీ అభ్యర్ధి హెచ్‌.డి.ఆర్.లింగ్దో మరణం వల్ల ఒక స్థానానికి ఎన్నిక వాయిదా పడింది.

    అలాగే నాగాలాండ్‌లోని ఒక నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఒకరు పోటీ లేకుండా గెలిచారు. దీంతో ఆ స్థానానికి పోలింగ్ నిర్వహించటం లేదు.

    మేఘాలయలో 21.75 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నాగాలాండ్‌లో 13.17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

    ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు త్రిపుర శాసనసభ ఎన్నికల ఫలితాలు మార్చి 2వ తేదీన వెలువడతాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. ఇటలీలో వలసదారుల పడవ మునక.. 59 మంది మృతి, కాథరీన్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఆలివర్ స్లో – బీబీసీ న్యూస్

    ఇటలీలో పడవ మునక

    ఫొటో సోర్స్, EPA

    ఇటలీ దక్షిణ తీరంలోని సముద్రంలో వలసదారులతో ప్రయాణిస్తున్న ఒక పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 59 మంది చనిపోయారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు.

    ఈ విషాదంలో మరో 30 మంది వరకూ గల్లంతయ్యారని ఇటలీ అంతర్గత వ్యవహారాల మంత్రి చెప్పారు.

    ఇటలీ లోని కాలాబ్రియా ప్రాంతంలో క్రొటోన్ పట్టణం వద్ద తీరానికి రావటానికి ప్రయత్నిస్తున్న బోటు.. సముద్రపు అలల తాకిడికి విరిగిపోయింది. ఆ సమయంలో బోటులో కనీసం 150 మంది ఉన్నట్లు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు చెప్తున్నారు.

    ఇటలీలో పడవ మునక

    ఫొటో సోర్స్, Italian Red Cross

    ఈ ప్రమాదం నుంచి 80 మంది ప్రాణాలతో బయటపడ్డట్లు ఇటలీ కోస్ట్‌గార్డ్ తెలిపింది. వారిలో కొందరు బోటు మునిగిపోయాక ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నారని చెప్పింది.

    ఈ పడవ కొన్ని రోజుల కిందట తుర్కియే నుంచి బయలుదేరింది. ఇందులో అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, సోమాలియా, ఇరాన్ దేశాలకు చెందిన దాదాపు 200 మంది వలసదారులు ఉన్నట్లు చెప్తున్నారు.

    పడవ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వలసదారులు

    ఫొటో సోర్స్, Shutterstock

    ఫొటో క్యాప్షన్, పడవ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వలసదారులు

    ఒడ్డుకు చేరుకునే క్రమంలో గాలులు, అలల తాకిడికి ఈ పడవ రాళ్లను ఢీకొట్టి ముక్కలుగా విరిగిపోయిందని చెప్తున్నారు. ఆ సమయంలో పడవలో ‘‘200 మందికి పైగా జనం’’ ప్రయాణిస్తున్నారని సహాయ సిబ్బంది ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

    ఆ లెక్కన చూస్తే ఇంకా 60 మందికి పైగా వలసదారుల ఆచూకీ తెలియటం లేదు. వారి కోసం తీరంలోను, సముద్రం మీద భారీ గాలింపు, సహాయ చర్యలు చేపట్టారు.

    ఈ ప్రమాదం పట్ల ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ విచారం వ్యక్తం చేశారు. ఈ మరణాలకు కారణం మనుషులను అక్రమంగా రవాణాచేసే ట్రాఫికర్లేనని తప్పుపట్టారు.

    ఇటలీ మ్యాప్
  19. అభినందన్ విమానం పాకిస్తాన్‌లో ఎలా కూలింది, ఆ సమయంలో అక్కడున్నవాళ్లు ఏమన్నారు?