నేటి ముఖ్యాంశాలు...
- పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ రాజ్యాంగ విరుద్ధమని పాకిస్తాన్ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ప్రకటించింది. శనివారం (ఏప్రిల్ 9వ తేదీ) ఉదయం 10 గంటలకు జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని పాకిస్తాన్ జియో న్యూస్ను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
- యుక్రెయిన్లోని బుచా నగరంలో మానవ హక్కుల ఉలంఘనలకు సంబంధించి.. రష్యాను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి సస్పెండ్ చేస్తూ ఐరాస సర్వసభ్య సభ నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది.
- ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని వారంతా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సీఎం జగన్కి అందించారు. 11వ తేదీన కొత్త క్యాబినెట్ ప్రమాణస్వీకారం ఉంటుంది. 10వ తేదీన అధికారికంగా కొత్త మంత్రుల పేర్లు వెల్లడించబోతున్నారు.
- కొరియా ఓపెన్లో పీవీ సింధూ, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ జోడి సత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ షెట్టీ కూడా క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు.
- వరి ధాన్యం సమస్యను చక్కదిద్దడం చేత కాకుంటే అధికారం నుంచి దిగిపొమ్మని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ వంటి సమర్థుడైన నాయకునికి అధికారం అప్పచెబితే వారం పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారు.
ఇవి ఈ నాటి ముఖ్యాంశాలు. యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలోకండి.