రష్యా దాడుల్లో 1300 మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయారు: జెలియెన్‌స్కీ

యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ సమీపంలో భీకర పోరాటం జరుగుతోంది. కీయెవ్‌లోని ఎయిర్‌ఫీల్డ్‌పై రష్యా క్షిపణి దాడులు చేసింది. అంతకుముందు, ఆహార గోదాంపై రష్యా దాడులు చేయడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. యుక్రెయిన్‌కు తాము బలగాలు పంపబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, అరుణ్ శాండిల్య

  1. యుక్రెయిన్‌పై రష్యా దాడులు: గత కొన్ని గంటల్లో ఏం జరిగిందంటే..

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ సమీపంలో భీకర పోరాటం జరుగుతోంది. రష్యా సైన్యం కీయెవ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉందన్న రిపోర్టులు వస్తున్నాయి.

    కీయెవ్‌లోని సైనిక ఎయిర్‌ఫీల్డ్‌పై రష్యా క్షిపణి దాడులు చేసింది. అంతకుముందు ఆహార గోదాంపైనా దాడులు చేసింది.

    రష్యాతో పోరాటంలో ఇప్పటి వరకు 1300 మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయారని ఆ దేశ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు.

    శుక్రవారం 500 నుంచి 600 మంది రష్యా సైనికులు యుక్రెయిన్ బలగాల ముందు లొంగిపోయారని ఆయన వెల్లడించారు. అయితే, ఈ వివరాలను బీబీసీ వెరిఫై చేయలేదు.

    ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్స్కోల్జ్‌లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మరోసారి టెలిఫోన్‌లో చర్చలు జరిపారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

    రష్యాతో తాము ప్రత్యక్ష యుద్ధం చేయబోమని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టం చేశారు.

    యుక్రెయిన్‌ మద్దతుగా తమ బలగాలను పంపించబోమని ఆయన అన్నారు. నాటో, రష్యాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ అంటూ జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధమేనని బైడెన్ అన్నారు.

    ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.

  2. ఆస్పత్రిపై రష్యా బాంబు దాడి తర్వాత రక్తపు మరకలతో బయటకు.. ఆ మర్నాడే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, THE GUARDIAN/BBC

    రష్యా బాంబు దాడులతో ధ్వంసమైన మరియుపూల్‌ ప్రసూతి ఆస్పత్రి శిథిలాల నుంచి బయటకు వస్తూ కనిపించిన గర్భిణి ఒకరోజు తర్వాత బిడ్డకు జన్మనిచ్చారని చెబుతున్నారు.

    ముఖంపై రక్తపు మరకలతో ఆస్పత్రి శిథిలాల నుంచి బయటకు వస్తున్న నెలలు నిండిన మారియానా ఫొటో వైరల్‌ అయింది.

    ఆస్పత్రిపై రష్యా దాడిని ఖండిస్తూ ఈమె ఫొటోను చాలా మంది షేర్ చేశారు.

  3. యుక్రెయిన్‌:ఒకే బాత్‌ రూం ఉన్న చీకటి బంకర్‌లో ఐదురోజులు భయంకరమైన జీవితం గడిపా-సత్య శ్రీజ

    విశాఖపట్నానికి చెందిన సత్యశ్రీజ యుక్రెయిన్‌లో 70 మంది విద్యార్థులతో కలిసి ఒక బంకర్‌లో ఐదు రోజులపాటు తలదాచుకున్నారు.

    చీకటి బంకర్లో, ఒకే బాత్రూంతో 5 రోజులపాటు భయంకరమైన, దుర్భరమైన జీవితాన్ని చవిచూశానని ఆమె వివరించారు.ఇంకా ఆమె ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి.

    వీడియో క్యాప్షన్, యుక్రెయిన్: బంకర్లో అయిదు రోజులు తలదాచుకున్న సత్య శ్రీజ ఏమన్నారంటే...
  4. బ్రేకింగ్ న్యూస్, రష్యా దాడుల్లో 1300 మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయారు-జెలియెన్‌స్కీ

    రష్యా, యుక్రెయిన్ సైన్యాల మధ్య కాల్పుల విరమణ జరగకుండా శాంతి చర్చల ప్రక్రియ మొదలుకాబోదని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు.

    అయితే, తాను పుతిన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

    రష్యాతో పోరాటంలో 1300 వందల మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. మృతుల సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా వెరిఫై చేయలేదు.

    మరోవైపు, సుమారు 6000 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు.

    జెలియెన్స్కీ‌

    ఫొటో సోర్స్, Getty Images

  5. బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్‌ సంక్షోభం: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫ్రాన్స్, జర్మనీ నాయకుల చర్చలు

    ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్స్కోల్జ్‌లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మరోసారి టెలిఫోన్‌లో చర్చలు జరుపుతున్నారు.

    అంతకుముందు గురువారం ఇరు దేశాల నాయకులు పుతిన్‌తో మాట్లాడారు. వెంటనే కాల్పుల విరమణ పాటించాలని ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఓలాఫ్స్కోల్జ్ పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు.

    అయితే, వారి విజ్ఞప్తిని పుతిన్ తోసిపుచ్చారు.

    మరోవైపు, శుక్రవారం రాత్రి వరకు రష్యా సైన్యం యుక్రెయిన్‌ భూభాగంలో ఎక్కడి వరకు చొచ్చుకొచ్చిందో ఈ కింది మ్యాప్‌లో చూడొచ్చు.

    రష్యా సైన్యం
    యుక్రెయిన్
  6. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో భీకర పోరాటం

    యుక్రెయిన్‌ రాజధానిలో ఇదీ పరిస్థితి.

  7. యుక్రెయిన్: కీయెవ్‌ను పూర్తిగా ధ్వంసం చేసేందుకు పుతిన్ సిద్ధమవుతున్నారా?

    ఫ్రాంక్ గార్డ్నర్

    బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్

    పుతిన్‌కు ఓపిక నశిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. యుక్రెయిన్‌తో పోరాటంలో రష్యా కొత్త దశలోకి అడుగుపెడుతోంది.

    రష్యా తన ఆయుధాలు, రాకెట్ లాంచర్లు, డ్రోన్లు, క్షిపణులను యుక్రెయిన్‌ రాజధాని కీయెవ్ సహా కీలక నగరాల సమీపానికి తరలించింది.

    ఈ నగరాల కోసం రష్యా చివరి పోరాటం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే, చెచెన్యాలోని గ్రోంజీ, సిరియాలోని అలెప్పోలో రష్యా ఎలా పోరాడిందో తెలుసుకోవాలి. అక్కడ రష్యా వీధి పోరాటానికి దిగింది. ఈ ప్రక్రియలో ఆ నగరాలు దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, AFP/Getty Images

    కీయెవ్‌ విషయంలో కూడా పుతిన్ అలాగే చేస్తారా అంటే చెప్పడం కష్టం.

    కీయెవ్‌‌కు ఎంతో చరిత్ర ఉంది. మాస్కో ఉనికిలోకి రావడానికి చాలా కాలం ముందే ఇది కీయెవన్ రస్ సామ్రాజ్యానికి రాజధాని.

    కానీ పుతిన్ కీయెవ్‌ను ధ్వంసం చేస్తే, ఆ వార్త రష్యాకు చేరితే ప్రజల నుంచి అంత సానుకూల స్పందన లభించకపోవచ్చు.

    కానీ యుక్రెయిన్‌ను లొంగదీసుకోవడానికి ఏం చేయడానికైనా పుతిన్ వెనక్కి తగ్గరని అనిపిస్తోంది.

  8. రష్యా సైన్యానికి ఊహించని షాక్ ఇచ్చిన యుక్రెయిన్, యుద్ధ ట్యాంకులపై అనూహ్య దాడి

    రాజధాని కీయెవ్ నగర శివార్లలో రష్యా సైన్యానికి ఊహించని షాక్ ఇచ్చింది యుక్రెయిన్.

    రష్యా యుద్ధ ట్యాంకులపై అనూహ్యంగా దాడిచేసి, వాటిని ధ్వంసం చేసింది.

    ఆ దృశ్యాలు ఈ వీడియోలో చూడండి.

  9. బ్రేకింగ్ న్యూస్, కీయెవ్‌ సమీపంలోని యుక్రెయిన్‌ ఎయిర్‌ఫీల్డ్‌పై రష్యా క్షిపణి దాడులు

    యుక్రెయిన్ పై రష్యా దాడి

    ఫొటో సోర్స్, Reuters

    కీయెవ్‌ సమీపంలోని యుక్రెయిన్ ఎయిర్‌ఫీల్డ్‌పై రష్యా క్షిపణి దాడులు చేసింది.

    ఈ దాడిలో రన్‌వే, చమురు డిపో ధ్వంసం కావడంతో పాటు ఆయుధాలు నిల్వ చేసిన ప్రాంతంలో పేలుళ్లు జరిగాయని కీయెవ్ మేయర్ చెప్పారు.

    ఎయిర్‌ఫీల్డ్‌ నుంచి దట్టమైన పొగ రావడం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో కనిపిస్తోంది.

    రష్యా సైన్యం చుట్టుముట్టిన చెర్నిహీవ్‌లో భీకర షెల్లింగ్ జరుగుతోంది.

    ఆ నగరంలో నీటి సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కూడా లేదు.

  10. పుతిన్‌ను అవమానిస్తే అణు యుద్ధం తప్పదా?

    అణు యుద్ధం వచ్చే అవకాశాలు, దాని తీవ్రత గురించి పరిశోధకులు ఎలా లెక్కలు వేయచ్చు అనేది విపత్తు ప్రమాదాల నిపుణులు సేత్ బామ్ వివరించారు.

  11. యుక్రెయిన్: రష్యా సైన్యం ఎలా దెబ్బతిందో చూడండి

    యుక్రెయిన్‌పై తమ దాడి పథకం ప్రకారమే జరుగుతోందని రష్యా చెబుతోంది. అయితే, దెబ్బతింటున్న రష్యా సాయుధ దళాలు మరో కథ చెబుతున్నాయి.

    అదేంటో ఈ వీడియోలో చూడండి.

  12. యుక్రెయిన్, రష్యా యుద్ధం: గడిచిన కొన్ని గంటల్లో ఏం జరిగిందంటే..

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, EPA/MIGUEL A. LOPES

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌ సమీపంలో భీకర పోరాటం జరుగుతోంది. రష్యా సైన్యం కీయెవ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉందన్న రిపోర్టులు వస్తున్నాయి.

    యుక్రెయిన్‌లోని ఇతర నగరాల్లో రాత్రంతా కూడా సైరన్లు వినిపించాయి.

    మరియుపూల్‌ నగర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా రష్యా అడ్డుకుంటోందని యుక్రెయిన్ మరోసారి ఆరోపించింది.

    అయితే, ప్రజల తరలింపునకు తమ సహాయాన్ని యుక్రెయిన్ నిరాకరిస్తోందని రష్యా పేర్కొంది.

    విద్యుత్ లేక, ఆహారం, నీళ్లు సరిపోక ఎముకలు కొరికే చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మరియుపూల్‌ కొందరు ప్రజలు చెబుతున్నారు.

    రష్యాతో తాము ప్రత్యక్ష యుద్ధం చేయబోమని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పష్టం చేశారు.

    యుక్రెయిన్‌ మద్దతుగా తమ బలగాలను పంపించబోమని ఆయన అన్నారు. నాటో, రష్యాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ అంటూ జరిగితే అది మూడో ప్రపంచ యుద్ధమేనని బైడెన్ అన్నారు.

  13. బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్ సంక్షోభం: కీయెవ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు- బ్రిటన్

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు బ్రిటన్ వెల్లడించింది.

    కీయెవ్‌కు ఉత్తర దిశ నుంచి రష్యా బలగాలు నగరంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది.

    కీయెవ్‌ను రష్యా ముట్టడించేందుకు ఈ చర్య ఉపకరించొచ్చని అభిప్రాయపడింది.

  14. IndW vs WIW: ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు విజయం

    భారత మహిళా క్రికెటర్లు

    ఫొటో సోర్స్, TWITTER/BCCI WOMEN

    ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 155 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 317 పరుగులు చేయగా లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 162 పరుగులకే ఆలవుట్ అయింది.

    భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3 వికెట్లు తీశారు.

  15. యుక్రెయిన్: మంటల్లో చిక్కుకున్న ఆహార గోదాం

    గోదాంలో మంటలు

    ఫొటో సోర్స్, SES

    కీయెవ్‌లోని ఒక ఆహార గోదాం మంటల్లో చిక్కుకుందని, రష్యా పెద్ద ఎత్తున షెల్లింగ్ జరపడంతో ఈ గోదాం మంటల్లో చిక్కుకుందని యుక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలిపింది.

    శనివారం వేకువన 3.40 గంటలకు(స్థానిక కాలమానం) పెద్ద ఎత్తున షెల్లింగ్ జరిగిందని తెలిపింది.

    మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇంకా పనిచేస్తున్నారని, ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ లేదని ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రకటించింది.

  16. స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్ కౌర్ సెంచరీలు... వెస్టిండీస్ టార్గెట్ 318

    స్మృతి మంధన

    ఫొటో సోర్స్, TWITTER/BCCI

    న్యూజీలాండ్‌లోని హామిల్టన్‌లో జరుగుతున్న విమెన్స్ వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ ముందు భారత్ 318 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ స్మృతి మందనతోపాటు హర్మన్‌ప్రీత్ కూడా సెంచరీలు కొట్టారు.

    స్మృతి మంధన కేవలం 119 బాల్స్‌లోనే 123 రన్లు కొట్టారు. మరోవైపు హర్మన్‌ప్రీత్ 107 బాల్స్‌లో 109 రన్లు కొట్టారు.

  17. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగుల ధర్నా ఉద్రిక్తం, ఉద్యోగాల నోటిఫికేషన్ కోరుతూ ధర్నా చేసిన యువత అరెస్ట్, ఇన్‌పుట్స్: శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    ఏపీలో నిరుద్యోగుల నిరసన

    ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి సహా అనేక చోట్ల నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు.

    జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఉద్యోగం వచ్చే వరకు రూ. 5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    ‘జాబ్‌లు ఎక్కడ జగన్’ అంటూ విజయవాడ ధర్నాచౌక్‌లో యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

    ధర్నాల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

    అయినా, విద్యార్థి సంఘాల నేతలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

    ఏపీలో నిరుద్యోగుల నిరసన

    జాబ్ నోటిఫికేషన్ విడుదల కోరుతూ విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ధర్నా చేస్తే అరెస్టులు చేయడం అన్యాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.

    ఏపీలో 2.35 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉండగా, 66 వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం యువతకు ద్రోహం చేయడమేనని ఆయన అన్నారు.

    ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా జగన్ సర్కార్ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు.

    ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగుల నిరసన
  18. మార్చి 14 నుంచి నార్వేలో నాటో డిఫెన్స్ ఎక్సర్‌సైజ్

    నార్వే జెండా

    ఫొటో సోర్స్, Getty Images

    నాటో తన దళాలను మార్చ్ 14న నార్వేకు పంపించనున్నట్లు తెలిపింది. ‘కోల్డ్ రెస్పాన్స్ 2022 ఎక్సర్‌సైజ్’ కోసం ఈ దళాలు అక్కడికి వెళ్తున్నాయి.

    27 దేశాలకు చెందిన 30 వేల బలగాలతో పాటు 200 విమానాలు, 50 యుద్ధ నౌకలు ఈ ఎక్సర్‌సైజ్‌లో పాల్గొంటున్నాయి.

    ఈ ఏడాది నాటో నిర్వహిస్తున్న భారీ ఎక్సర్‌సైజ్ ఇదే.

    మార్చి 14 నుంచి ఆర్కిటిక్ సముద్రంతో పాటు భూ, గగనతలాల్లో నార్వే శీతల వాతావరణంలో పాశ్చాత్య దేశాలు తమ పోరాట నైపుణ్యాలు మెరుగుపర్చుకునేందుకు ఈ విన్యాసాలు తోడ్పడతాయి.

    రష్యాకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఈ ఎక్సర్‌సైజ్ చేపడుతున్నారు.

    యుక్రెయిన్, రష్యా యుద్ధానికి ముందే ఈ విన్యాసాల నిర్వహణకు నిర్ణయమైనప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో దీన్ని ప్రాధాన్యమేర్పడింది.

    మార్చి 14 నుంచి మొదలయ్యే ఈ ఎక్సర్‌సైజ్ ఏప్రిల్ 1తో ముగుస్తుంది.

  19. యుక్రెయిన్‌లో కిరాయి సైనికులు: ఎవరు వీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు

    సాయుధులు

    ఫొటో సోర్స్, ANTITERROR ACADEMY OF THE CZECH REPUBLIC

    యుక్రెయిన్ సైన్యంలో పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన అనేకమంది సీఎంపీ (అద్దె సైనికులు) పని చేస్తున్నారు. అయితే, 'సైలెంట్ ప్రొఫెషనల్స్' వెబ్‌సైట్ ద్వారా బాధితులను తరలించడానికి సిద్ధపడి వస్తున్న ఈ సైనికులు తమకు కూడా సైన్యంలో పని చేసే వారి స్థాయి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

    అయితే, సైట్లో కనిపిస్తున్న ఈ జాబ్ ఆఫర్లు ఎవరు ఇస్తున్నారో తెలియదు.

    అయితే, ఇలాంటి వారి కోసం ఈ కంపెనీలకు 30,000 నుంచి 60 లక్షల డాలర్లు ( సుమారు రూ. 22 లక్షల నుంచి రూ.45 కోట్ల వరకు) చెల్లిస్తున్నాయని చెబుతున్నారు.

    ఎక్కువ కుటుంబాలలను, గ్రూపులను, అలాగే వారి ఆస్తులను కూడా తరలించే ఉద్దేశంతో కొంతమంది ఎక్కువ మొత్తాలను చెల్లించడానికి ముందుకొస్తున్నారని చెబుతున్నారు.

  20. చెర్నోబిల్ విద్యుత్ సరఫరా లైన్లు పునరుద్ధరిస్తున్న ఐఏఈఏ

    చెర్నోబిల్ ప్లాంట్

    ఫొటో సోర్స్, Getty Images

    చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు బయట నుంచి విద్యుత్ సరఫరా పునఃప్రారంభించే ప్రయత్నాలను ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) నిపుణులు ప్రారంభించారని యుక్రెయిన్ వెల్లడించింది.

    రష్యా బలగాల అధీనంలో ఉన్న చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి పవర్ గ్రిడ్ తొలగించారని యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యన్లు ‘ఉగ్రవాద’ దాడికి సిద్ధంకాగా ఆ యత్నాలను అడ్డుకున్నామని అనంతరం యుక్రెయిన్ వెల్లడించింది.

    ప్లాంటులోని ఒక సెక్షన్‌ను గురువారం పునరుద్ధరించినా ఇతర చోట్ల డ్యామేజ్ కావడంతో ప్లాంటు ఆగుతోందని ఐఏఈఏకు యుక్రెయిన్ తెలిపింది.

    1986లో అణు విపత్తు చోటుచేసుకున్న ఈ ప్లాంట్ వద్ద పనులు కొనసాగుతున్నాయని ఐఏఈఏ తెలిపింది.