రష్యా బాంబు దాడులకు ధ్వంసమైన యుక్రెయిన్లోని అనాథాశ్రమం
కీవ్ నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వోర్జెల్లోని అనాథాశ్రమం రష్యన్ల బాంబుదాడిలో ధ్వంసమైందని యుక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారు.
రష్యన్ క్షిపణి శకలాలు అనాథాశ్రమం మీద పడ్డాయని ఇరినా వెనెడిక్టోవా ఫేస్బుక్లో వెల్లడించారు. ఆ అనాథాశ్రమంలో 50 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు.
అయితే, పిల్లల్లో ఎవరికీ ప్రాణహాని కలుగలేదని, వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు.
అయితే, తూర్పున సుమీ ఓబ్లాస్ట్ ప్రాంతంలో ఓక్టిర్కా అనే పట్టణంలో రష్యన్లు వేసిన బాంబుల వల్ల చాలా మంది పిల్లలు గాయపడ్డారని యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు.
ప్రాంతీయ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ అధిపతి డిమిత్రో జివివిస్కీ చెప్పిన ప్రకారం అక్కడ జనావాస ప్రాంతాల మీద, ఒక చిన్న పిల్లల బడి మీద దాడులు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images



















