నందమూరి తారకరత్న: హృదయాలయ ఆసుపత్రికి వెళ్లనున్న జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
నారా లోకేశ్ పాదయాత్రలో తీవ్రంగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను ఆదివారం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ పరామర్శించనున్నారు.
ఈ మేరకు ఈరోజు ఉదయం వారిద్దరూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లనున్నారు.
హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లనున్నట్లు సమాచారం.
నారాయణ హృదయాలయ ఆసుపత్రికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వస్తుండటంతో టీడీపీ శ్రేణులు,అభిమానులు భారీగా తరలి రానున్నారు.