వ్యవసాయ చట్టాల రద్దు: సింఘు బోర్డర్‌లో రైతుల సంబరాలు

శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెంచింది తమ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ఓట్ల కోసమే చట్టాలు వెనక్కు తీసుకుంది-అఖిలేష్ యాదవ్

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఎన్నికల భయంతోనే ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుందని, రైతుల ప్రయోజనం కోసం కాదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.

    "ప్రభుత్వం ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ ఇలాంటి చట్టాలు ఏవైనా తీసుకురావచ్చు" అని ఆయన అన్నారు.

    "భవిష్యత్తులో రైతులను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి చట్టాలు తీసుకురామని భరోసా ఎవరు ఇస్తారు" అని ఆయన ప్రశ్నించారు.

    "రైతులు క్షమించరు, బీజేపీని తుడిచిపెట్టేస్తారు. బీజేపీ క్షమాపణలు అడుగుతుందా" అన్నారు.

  2. “మీ ఉద్దేశాలు, మారే మీ వైఖరిని నమ్మడం కష్టం”-ప్రియాంకా గాంధీ

    ప్రియాంకా గాంధీ

    ఫొటో సోర్స్, Ani

    “ఇక ఎన్నికల్లో ఓడిపోతామని అనిపించగానే, మీకు హఠాత్తుగా ఈ దేశంలో సత్యం బోధపడింది” అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనపై స్పందించిన కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    600 మందికి పైగా రైతుల బలిదానం, 350 రోజులకు పైగా పోరాటం, మోదీజీ మీ మంత్రి కొడుకు రైతులను తొక్కించి చంపినా మీరు పట్టించుకోలేదు. మీ పార్టీ నేతలు రైతులను అవమానిస్తూ వారిని దేశద్రోహులు, గూండాలు, అల్లరి మూకలని అన్నారు. నిరసనకారులను లాఠీలతో కొట్టించారు, వారిని అరెస్ట్ చేశారు అన్నారు.

    “ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి కనిపించేసరికి మీకు హఠాత్తుగా ఈ దేశాన్ని రైతులే నిర్మించారనే సత్యం బోధపడింది. ఈ దేశం రైతులది. ఈ దేశానికి అసలైన రక్షకులు రైతులే. రైతుల ప్రయోజనాలను అణచివేసి ఏ ప్రభుత్వమూ ఈ దేశాన్ని నడిపించలేకపోయింది” అన్నారు.

  3. సింఘు బోర్డర్‌లో రైతుల సంబరాలు

    3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామన్న ప్రధాని మోదీ ప్రకటనతో సింఘు బోర్డర్‌లో పండుగ వాతావరణం ఏర్పడింది.

    అక్కడ రైతుల సంబరాలకు సంబంధించిన కొన్ని ఫొటోలు

    రైతుల సంబరాలు
    రైతుల సంబరాలు
    రైతుల సంబరాలు
  4. మోదీకి వేరే దారి లేకుండా పోయింది- అసదుద్దీన్ ఒవైసీ

    కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవడంపై ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యంగా స్పందించారు.

    మొదటి ట్వీట్‌లో ఒక కవిత ట్వీట్ చేసిన ఆయన, తన రెండో ట్వీట్‌లో రైతులకు అభినందనలు తెలిపారు.

    “వ్యవసాయ చట్టాలు మొదటి నుంచీ రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం అహంకారం వల్ల రైతులు రోడ్లపైకి రావాల్సి వచ్చింది. ప్రభుత్వం మొండిగా వ్యవహరించకపోయుంటే 700 మందికి పైగా రైతులు ప్రాణాలు నిలిచేవి. రైతుల ఉద్యమానికి అభినందనలు. పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో మోదీకి మరో దారి లేకుండా పోయింది అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?

    కేంద్రం ప్రభుత్వం దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి గతేదాడి తొలుత మూడు ఆర్డినెన్సులను, తర్వాత వాటి స్థానంలో బిల్లులను తెచ్చింది. అవి పార్లమెంటు ఆమోదం పొంది చట్టాలయ్యాయి.

    2020 సెప్టెంబర్ 15వ తేదీన ఒక బిల్లు, 17వ తేదీన మిగతా రెండు బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొందాయి.

    వీటిని వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్ర పక్షం, ఎన్డీయే కూటమిలోని పార్టీ శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ అప్పుడే తన పదవికి రాజీనామా చేశారు.

    అసలు ఏమిటీ మూడు బిల్లులు.. ఈ బిల్లుల్లో ఏముంది? రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? శిరోమణి అకాలీదళ్, మరికొన్ని ఇతర పార్టీలు కానీ, రైతుల సమస్యలు, హక్కుల కోసం పోరాడే సంస్థలు కానీ చెబుతున్న అభ్యంతరాలేమిటి?

  6. ప్రతి రైతుకూ అభినందనలు-మమతా బెనర్జీ

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తన ట్వీట్ ద్వారా రైతులకు శుభాకాంక్షలు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    బీజేపీ క్రూరత్వానికి చలించకుండా అలుపెరగని పోరాటం చేసిన ప్రతి రైతునూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మీ విజయం. ఈ యుద్ధంలో ఆత్మయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి

  7. 'అధికారం కంటే ప్రజాశక్తి గొప్పది- కేటీఆర్

    వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవడాన్ని తెలంగాణలోని పాలక పార్టీ టీఆర్ఎస్ తమ ఘనతగా చెప్పుకొంటోంది.

    వరి కొనుగోలు వివాదంలో కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ధర్నా తరువాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అధికారంలో ఉన్నవారి శక్తి కంటే ప్రజల శక్తిదే పైచేయి అని మరోసారి నిరూపితమైందని టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ అన్నారు.

    ఇది రైతుల విజయమని ఆయన అన్నారు.

  8. 'ఆ రోజు వరకూ వేచిచూస్తాం'- రాకేష్ టికాయత్

    మోదీ నిర్ణయంపై రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ స్పందిస్తూ... తమ ఆందోళనలు విరమించబోమని.. పార్లమెంటులో దీని రద్దు ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆందోళన తప్పదన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ‘‘మేం ఇప్పుడే ఆందోళన విరమించం, పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రోజు కోసం వేచి చూస్తాం. ఎంఎస్‌పీతో పాటు రైతుల ఇతర సమస్యలపైనా ప్రభుత్వం చర్చించాలి’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

  9. రైతు గెలిచాడు - కాంగ్రెస్

    మోదీ తాజా నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తన సత్వర స్పందనను ట్విటర్ ద్వారా వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ‘‘అహంకారం ముక్కలైపోయింది.. నా దేశ రైతు గెలిచాడు’’ అంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    'దేశంలోని రైతుల సత్యాగ్రహానికి అహంకారం తలవంచాల్సి వచ్చింది. అన్యాయంపై రైతులు సాధించిన విజయానికి అభినందనలు'' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

  10. పంజాబ్ మాజీ సీఎం హర్షం

    మోదీ తాజా నిర్ణయంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు.

    గురు నానక్ జయంతి రోజున మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    కేంద్ర ప్రభుత్వం ఇక ముందు కూడా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందని అమరీందర్ అన్నారు.

  11. క్షమాపణ చెప్పిన ప్రధాని

    2014లో తన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని.. వారి అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు.

    రైతుల కష్టాలు తనకు తెలుసు కాబట్టి వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చానని చెప్పారు.

    వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు పెంచామని.. ఏటా రూ. 1.25 లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి వెచ్చిస్తున్నాం, రైతులకు తక్కువ ధరకే విత్తనాలు అందించేలా చర్యలు తీసుకున్నామని మోదీ చెప్పారు.

    వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దేశంలోని రైతులందరికీ క్షమాపణ చెప్పారు.

    ‘ప్రభుత్వం ఈరోజే వ్యవసాయానికి సంబధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదే జీరో బడ్జెట్ వ్యవసాయం, అంటే సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, క్రాప్ పాటర్న్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో మార్చడానికి, ఎంఎస్‌పీని మరింత ప్రభావంగా, పారదర్శకంగా మార్చడానికి, ఇలాంటి అన్ని విషయాలపై భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిదులు, రైతులు ఉంటారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు ఉంటారు’ అని చెప్పారు.

  12. ప్రధాని మోదీ

    ఫొటో సోర్స్, TWITTER/NARENDRAMODI

    శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

    రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వ్యవసాయ బడ్జెట్ 5 రెట్లు పెంచింది తమ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం, మూడు చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటన

    జాతి నుద్దేశించి మాట్లాడిన ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర్లో మూడు వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

    నేనుపవిత్ర హృదయంతో క్షమించమని అడుగుతూ ఒకటి చెప్పాలనుకుంటున్నా.

    మా ప్రయత్నంలోనే ఏదో లోపం జరిగుంటుంది. దీపం వెలుగు లాంటి సత్యాన్ని కొందరు రైతులు అర్థం చేసుకోలేకపోయారు.

    ఈరోజు గురునానక్ జయంతి రోజున ఎవరినీ నేను దోషులుగా చెప్పను.

    ఈరోజు మీకు, మొత్తం దేశానికి ఒక విషయం చెప్పాలనే మీ ముందుకు వచ్చాను.

    మేం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, రిపీల్ చేయాలని నిర్ణయించాం.

    ఈ నెల చివర్లో మొదలవుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ మూడు వ్యవసాయ చట్టాలను రిపీల్ చేయడానికి అవసరమైన రాజ్యాంగ ప్రక్రియను పూర్తి చేస్తాం అని ప్రధాని చెప్పారు.

    "వీటికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతు సోదరులకు నా వినతి. గురునానక్ జయంతి పర్వదినం రోజున మీరంతా మీ మీ ఇళ్లకు వెళ్లాలి. మీ పొలాలకు వెళ్లాలి. మీ కుటుంబాల మధ్యకు వెళ్లాలి. రండి, ఒక కొత్త ప్రారంభానికి సిద్ధం అవుదాం. కొత్తగా ముందుకెళ్దాం" అని కోరారు..