యుక్రెయిన్: కరెంట్, నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ప్రచురణ

యుక్రెయిన్‌లోని విద్యుదుత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రష్యా మళ్లీ దాడులు చేసింది.

పవర్ ప్లాంట్లపై ఎడతెగకుండా క్షిపణి దాడులు కొనసాగించారు. దాంతో కీయెవ్ సహా చాలా నగరాల్లో ప్రతీ ఐదుగురిలో నలుగురికి నీరు అందడం లేదని కీయెవ్ మేయర్ చెప్పారు.

బీబీసీ ఇంటర్నేషనల్ ఎడిటర్ జెరెమీ బోవెన్ గత వారం యుక్రెయిన్‌ యుద్ధక్షేత్రాల్లో పర్యటించారు.

తూర్పు యుక్రెయిన్‌లోని డోన్బాస్ నుంచి ఖెర్సాన్‌ సమీపంలోని మైరోల్యుబివ్‌కా గ్రామం వరకూ ఆయన ప్రయాణించారు.

ఖెర్సాన్‌లో యుక్రెయిన్ సేనల ప్రతిఘటనను ఎదుర్కొనేందుకు రష్యా మెరికల్లాంటి సైనికుల్ని మోహరించింది.

ఈ కథనంలో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలవరపర్చవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)