దక్షిణాఫ్రికాలో విదేశీయులపై పెరుగుతున్న దాడులతో మరోసారి హింసాకాండ చెలరేగవచ్చన్న భయాలు

ప్రచురణ

దక్షిణాఫ్రికాలో విదేశీయుల పట్ల ప్రజల్లో ద్వేషం పెరుగుతోంది. దీంతో వలసదారులకు వ్యతిరేకంగా హింసాకాండ చెలరేగవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

విదేశీయతా భయంతో జరుగుతున్న విదేశీయుల హత్యలు 2021లో అంతకు ముందటి ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి.

విదేశీయుల పట్ల పెరుగుతున్న ద్వేషం చాలా ఆందోళనకరమని అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా అన్నారు.

ఇది మునుపటి జాతివివక్ష కాలం నాటి రోజుల్ని గుర్తుకు తెస్తోందన్నారు.

బీబీసీ ప్రతినిధి లెబో డిసేకో దక్షిణాఫ్రికాలోని ఒక టౌన్‌షిప్‌లో భయం నీడలో బతుకుతున్న కొందరు వలసదారులతో మాట్లాడారు.

పూర్తి సమాచారం కోసం పై వీడియోను చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)