అఫ్గానిస్తాన్ పేరు మార్చి, తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబాన్లు

ప్రచురణ

అఫ్గానిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబాన్ ప్రకటించింది.

ఈ ప్రభుత్వాన్ని తాలిబాన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ నడిపిస్తారని, ఆయనకు డిప్యూటీగా తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ వ్యవహరిస్తారని తాలిబాన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ విలేకరులకు తెలిపారు.

ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్‌ ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్టులో ఉన్నారు.

''మా దేశ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు'' అని జుబీహుల్లా అన్నారు.

20 ఏళ్ల యుద్ధానికి తెరదించుతూ ఆగస్టు 15వ తేదీన తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)