హైతీలో భారీ భూకంపం, 304 మంది మృతి

ప్రచురణ

కరిబియన్ దేశం హైతీని శక్తిమంతమైన భూకంపం వణికించింది.

భూకంప తీవ్రతతో చాలా భవనాలు కుప్పకూలడంతో 304 మంది చనిపోయారు. 1800 మందికి పైగా గాయపడ్డారు.

దేశంలో చర్చిలు, హోటళ్ల సహా ఎన్నో భవనాలు దెబ్బతిన్నాయి.

''దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉంది''అని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)