చైనాలో వీగర్ ముస్లింలపై రేప్లు.. తీవ్రమైన లైంగిక హింస.. బయటపెట్టిన బాధితులు
చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో వీగర్ ముస్లింల కోసం నిర్వహిస్తున్న 'రీ ఎడ్యుకేషన్ ' శిబిరాల్లో ఒక పథకం ప్రకారం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని.. వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ, హింసిస్తున్నారని బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.
అక్కడ జరుగుతున్న లైంగిక దాడులు, హింస మనసులను కలచివేస్తున్నాయి.
తుర్సునే జియావుదున్ చైనా నిర్బంధ శిబిరాల్లో తొమ్మిది నెలలు గడిపారు.
"అక్కడి పురుషులు ఎప్పుడూ మాస్క్తోనే కనిపించేవారు. అప్పటికి కరోనా లేనే లేదు, అయినా మాస్కులు ధరించేవారు. వాళ్లు పోలీస్ యూనిఫాంలు కాకుండా మామూలు సూట్లు వేసుకునేవారు.
అర్ధరాత్రి దాటాక వాళ్లు సెల్లోకి వచ్చేవారు. వాళ్లకు నచ్చిన మహిళలను ఎత్తుకెళిపోయేవారు. అదే కారిడార్లో నిఘా కెమేరాలు లేని బ్లాక్ రూంకు తీసుకెళ్లేవారు" అని జియావుదున్ వివరించారు.
పలుమార్లు తనను కూడా ఎత్తుకెళ్లారని జియావుదున్ చెప్పారు.
"నా జీవితంలో మర్చిపోలేని విషాదం అది. దాని గురించి మాట్లాడడానికి కూడా నాకు మనసు రావట్లేదు" అని ఆమె అన్నారు.
కొన్ని వ్యక్తిగత అధ్యయనాల అంచనాల ప్రకారం, పది లక్షలకన్నా ఎక్కువమంది మహిళలు, పురుషులను ఈ శిబిరాల్లో నిర్బంధించారు.
అయితే, ఈ శిబిరాలను వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాల 'పునర్విద్య' (రీ ఎడ్యుకేషన్) కోసం ఏర్పాటు చేశామని చైనా చెబుతోంది.
చైనా ప్రభుత్వం, వీగర్ ముస్లింల మతపరమైన స్వేచ్ఛను, ఇతర హక్కులు, స్వాతంత్ర్యాన్ని క్రమక్రమంగా తొలగించేందుకు ప్రయత్నిస్తోందని, వారిపై సామూహిక నిఘా, నిర్బంధం, బలవంత బోధన, స్టెరిలైజేషన్కు పాల్పడుతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
''2014లో జిన్జియాంగ్ ప్రావిన్స్లో వీగర్ వేర్పాటువాదులు ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారు.
అనంతరం ఆ ప్రాంతాన్ని సందర్శించిన షీ జిన్పింగ్ ఈ శిబిరాలను ప్రారంభించారు.
న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టిన పత్రాల ప్రకారం.. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే జిన్పింగ్ అధికారులకు ఆదేశాలు ఇస్తూ "ఏ రకమైన దయ, జాలి చూపవద్దని" సూచించారు.
అప్పటినుంచీ చైనా అధికారుల చర్యలు మారణహోమాన్ని తలపిస్తున్నాయ''ని గత నెలలో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.
అయితే, ఇవన్నీ "అబద్ధాలని, అసంబద్ధ ఆరోపణలని" చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది.
ఇవి కూడా చదవండి:
- బెత్లెహాంలోని ఈ ‘పాల గుహ’ మట్టికి పిల్లల్ని పుట్టించే శక్తి ఉందా?
- మత ప్రచారకులను రావొద్దంటున్న ఈ బోర్డులు నిజంగానే ఉన్నాయా?
- అండమాన్ సెంటినల్: ఆ ఆదివాసీలను బయట ప్రపంచంలోకి తీసుకొచ్చినపుడు ఏమైంది?
- అండమాన్ సెంటినలీస్: మిషనరీలు దేవుడికి సేవ చేస్తున్నాయా... దేవుడిలా వ్యవహరిస్తున్నాయా...
- ‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు’
- క్రీ.శ.536: చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం అదే
- అండమాన్లో క్రైస్తవ మత ప్రచారకుడి హత్య: ‘సువార్త బోధించేందుకే అక్కడికి వెళ్లాడు’
- క్యాథలిక్ చర్చిలో పవిత్ర కన్యలు: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
- కొన్ని చర్చిల్లో మహిళలను 'సెక్స్ బానిసలు'గా చేశారు - అంగీకరించిన పోప్ ఫ్రాన్సిస్
- ఫూమీ: ఏసుక్రీస్తు విగ్రహాలను బలవంతంగా కాలితో తొక్కించే ఈ ఆచారం ఏంటి?
- నాట్రడామ్ చర్చి: ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం, శిలువ అవశేషం, జీసస్ గోరు ఇక్కడే ఉన్నాయి
- చాలా మతాలు అంతరించినా క్రైస్తవం ఎలా విస్తరించింది?
- నార్త్ పోల్లోని శాంటా ఇల్లు ఇది... ఇక్కడికి ఎలా వెళ్లాలో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)