విజయనగరం జట్టు ఆశ్రమం: అనాథ గిరిజన పిల్లలకు అమ్మ ఒడి

ప్రచురణ

ఆంధ్రా ఒడిశా సరిహద్దులో నివసించే సవర గిరిజన జాతిలో ఒక ఆచారం ఉంది. ఎవరైనా స్త్రీ భర్త చనిపోయాక వేరే పెళ్లి చేసుకున్నా, లేదా భర్తను విడిచి వెళ్లిపోయినా... ఆ భర్తతో పుట్టిన పిల్లల్ని ఆ ఊళ్లోనే వదిలేయాలి.

ఇలా తన వాళ్లు ఉన్నా అనాథలుగా మారిపోయిన ఎందరో పిల్లలు గిరిజన గూడెల్లో మిగిలిపోతున్నారు. అలాంటి వారందరినీ జట్టు ఆశ్రమానికి తీసుకొచ్చి, పెంచి, చదువు చెప్పించి, పెళ్లిళ్లు చేయడంతో పాటు, వారికి కాన్పు బాధ్యతల్ని కూడా జట్టు ఆశ్రమమే చూసుకుంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)