ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి వేలాది అభిమానుల అంతిమ వీడ్కోలు

వీడియో క్యాప్షన్, తామరైపాక్కంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు పూర్తి
ప్రచురణ

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఈ రోజు ఉదయం తామరైపాక్కంలోని ఆయన ఫామ్‌హౌస్‌లో జరిగాయి.

పోలీసు గౌరవ వందనంతో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు.

ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలుకు అంత్యక్రియలు జరపనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి శుక్రవారం ప్రకటించారు. ఆ మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

కరోనా కారణంగా ఈ అంత్యక్రియలకు గరిష్టంగా 100 కంటే ఎక్కువ మందికి అనుమతి లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.

అయినప్పటికీ తామరైపాక్కంలోని బాలసుబ్రహ్మణ్యం ఫామ్‌హౌస్‌ వద్దకు వేలాది మంది అభిమానులు వచ్చి, ఆయన్ను కడసారి చూసి, వీడ్కోలు పలికారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)