భారత్ - చైనా సరిహద్దు: బలగాల ఉపసంహరణ శాశ్వతమా? తాత్కాలికమా?
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చెలరేగిన కొన్ని ప్రాంతాల్లో రెండు వైపులా బలగాలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు సరిహద్దుల్లో జరిగే పరిణామాలను పర్యవేక్షిస్తున్న భారత అధికారులు ధ్రువీకరించారు.
ఢీ అంటే ఢీ అంటూ ఎదురెదురు పడిన బలగాలు ప్రస్తుతానికి తాత్కాలికంగా వెనక్కి వెళ్తున్నట్లు వారు వెల్లడించారు.
"గాల్వన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో బలగాలను రెండు వైపులా వెనక్కి తీసుకుంటున్నాం. అయితే ఉత్తరాన ఉండే డెప్సాంగ్ మైదానాలు, దక్షిణాన ఉండే ప్యాంగాంగ్ సో సరస్సుల్లో పరిస్థితుల గురించి మేం మాట్లాడటంలేదు" అని ఓ అధికారి బీబీసీతో చెప్పారు.
"టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను ప్రస్తుతానికి రెండు వైపులా తొలగిస్తున్నారు. బలగాలను ఉపసంహరించుకుంటున్నారు. దీని అర్థం బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నామనో లేదా సమస్య పరిష్కారం అయిందనో కాదు" అని మరో అధికారి వివరించారు.
ఉపగ్రహ చిత్రాల పరిశీలన, విహంగ వీక్షణంతోపాటు క్షేత్రస్థాయిలో సైనికులు వెళ్లి పరిస్థితులను ధ్రువీకరించే కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోందని చెప్పారు.
చైనా బలగాలు ఏఏ చోట్ల ఎంతెంత దూరం వెనక్కి వెళ్లాయో మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే దీనిపై అడిగిన ప్రశ్నలకు అధికారులు స్పందించలేదు. "ఇంత దూరం అంటూ ఏమీలేదు. చుషుల్లో జూన్లో జరిగిన 30 కోర్ కమాండర్స్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలనే అమలు చేశాం"అని వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
- టాంజానైట్ రాళ్లు రెండు దొరికాయి.. రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు
- పిల్లలపై కరోనావైరస్ ప్రభావం అంతంత మాత్రమే - తాజా సర్వే
- కరోనావైరస్ లాక్డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)