హయా సోఫియా: ఒకప్పుడు చర్చి, మసీదు, మ్యూజియం.. మళ్లీ మసీదుగా మారుస్తారా?

ప్రచురణ

ఇస్తాంబుల్‌లోని చారిత్రక కట్టడం హయా సోఫియాను మసీదుగా మార్చాలనే ప్రతిపాదనపై తీసుకోవలసిన నిర్ణయాన్ని టర్కీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ వాయిదా వేసింది.

17 నిమిషాల పాటు సాగిన విచారణ అనంతరం మరో 15 రోజుల్లో తీర్పుని ప్రకటిస్తామని టర్కీ అత్యున్నత కార్యనిర్వాహక సంస్థ తెలిపింది

1500 సంవత్సరాల పురాతనమైన ఈ కట్టడాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది 1930 లలో మ్యూజియంగా మారక ముందు మసీదుగా, అంత కన్నా ముందు చర్చి గా ఉండేది.

కోర్టు అంగీకరిస్తే ఇది మళ్ళీ మసీదుగా మారే అవకాశం ఉంది.

గత సంవత్సరం జరిగిన ఎన్నికల ప్రచారంలో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ దీనిని మసీదుగా మార్చాలనే ప్రతిపాదనను తెచ్చారు.

ఇస్లాం మద్దతుదారులు దీనిని ఎప్పటినుంచో మసీదుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, సెక్యులర్ వర్గాలు ఈ డిమాండ్ ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఈ ప్రతిపాదన అంతర్జాతీయ రాజకీయ, మత నాయకుల విమర్శలు ఎదుర్కొంది.

గ్రీస్ సాంస్కృతిక శాఖా మంత్రి లీన మెండోని ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. టర్కీ ప్రభుత్వం జాతీయ, మత వాదాన్ని ప్రేరేపిస్తోందని ఆమె ఆరోపించారు.

ప్రస్తుతం మ్యూజియంగా కొనసాగుతున్న హయా సోఫియాను మసీదుగా మార్చాలంటే అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించాలని యునెస్కో డెప్యుటీ డైరెక్టర్ ఎర్నెస్టో ఒట్టోన్ రామిరెజ్ గ్రీక్ వార్తా పత్రిక టా నియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.

ఈ ప్రతిపాదనపై యునెస్కో టర్కీకి లేఖ రాసిందని, కానీ వారినుంచి ఎటువంటి జవాబూ రాలేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)