తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీని కలిసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ప్రచురణ

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగుతున్న ఈ యాత్రలో ఐదో రాష్ట్రం తెలంగాణ కాగా, తెలంగాణలోనే యాత్ర 1500 కిలోమీటర్ల మార్కును దాటనుంది.

ఆదివారం ఉదయం కర్ణాటకలోని రాయచూర్ నుంచి ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గంటలకు యాత్ర ప్రారంభమైంది.

రాయచూర్ నుంచి కొన్ని గంటల్లోనే యాత్ర తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించింది.

కృష్ణా నది కర్ణాటక - తెలంగాణ సరిహద్దు కావడంతో, కృష్ణా వంతెన మీద నుంచే తెలంగాణ రాష్ట్రంలోకి రాహుల్ కి ఘన స్వాగతం చెప్పడానికి భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ కాంగ్రెస్.

16 రోజుల పాటూ తెలంగాణలో ఉండే రాహుల్, 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా మొత్తం 375 కిలోమీటర్లు నడుస్తారు.

నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశిస్తారు. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాదారణ బ్రేక్ ఉంటుంది.

12 రోజులు యాత్ర ఉంటుంది. పాదయాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో మీటింగులు ఏర్పాటు చేసింది కాంగ్రెస్.

రోజుకు సగటున 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర ఉంటుంది.

రాహుల్ యాత్ర హైదరాబాద్ మీదుగా వెళుతుంది. బోయినపల్లిలో నైట్ హాల్ట్ ఉంటారు. నెక్లెస్ రోడ్ లో సభ ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)