విజయవాడ జింఖానా మైదానంలో బాణసంచా దుకాణాల్లో అగ్ని ప్రమాదం- ఇద్దరు మృతి చెందారు.

ప్రచురణ

విజయవాడలోని జింఖానా మైదానంలో గల ఒక దుకాణంలో బాణసంచా పేలడంతో ఇద్దరు మృతి చెందారు.

దుకాణాలకు వచ్చిన బాణసంచాను దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో 15, 16, 17వ నంబర్‌ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి.

నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

పేలుడు ధ్వనులతో స్థానికులుభయంతోఇళ్ల నుంచి‌బయటకుపరుగులుతీశారు.

మరొకవైపు శనివారం రాత్రి తిరుపతి వడమాల పేటలో మంటలు అంటుకోవడంతో బాణసంచా దుకాణాలకు మంటలు అంటుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)