తల్లికి దూరమైన ఒక చిరుత పిల్ల.. మళ్లీ తన తల్లి దగ్గరికి ఎలా చేరిందంటే..

వీడియో క్యాప్షన్, తల్లికి దూరమైన ఒక చిరుత పిల్ల.. మళ్లీ తన తల్లి దగ్గరికి ఎలా చేరిందంటే..
ప్రచురణ

ముంబయిలోని సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనంలో తల్లికి దూరమైన ఒక చిరుత పిల్లను అటవీ శాఖ అధికారులు తిరిగి తల్లి చెంతకు చేర్చారు.

అక్టోబర్ 10న ఉదయం గోరేగావ్ ఫిల్మ్ సిటీ దగ్గర ఒక నాలుగు వారాల వయసున్న చిరుతపులి పిల్లను చూసి కుక్కలు మొరగడం స్థానికులు చూశారు.

అక్కడున్న ఒక సెక్యూరిటీ గార్డ్ కుక్కల నుంచి ఆ చిరుత పిల్లను కాపాడి, అటవీ అధికారులకు అప్పగించాడు.

అదే రోజు రాత్రి ఆ పిల్లను తల్లి దగ్గరకు చేర్చాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

దీంతో, అక్టోబర్ 12న ఉదయం అటవీ శాఖ అధికారులు ఆ పిల్లను తల్లి దగ్గరికి తీసుకొచ్చారు.

బోనులో ఉన్న తన పిల్లను తల్లి గుర్తించింది.

బయటికి వచ్చిన పిల్లను చిరుతను తనతో తీసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)