నీటిలో మునిగిపోయిన బస్... 20 మందికి పైగా ప్రయాణికులను కాపాడిన స్థానికులు

ప్రచురణ

భారీ వర్షం పడటంతో సిటీ బస్సు నీటిలో మునిగిపోయింది. బస్సులోని 20 మందికి పైగా ప్రయాణికులను స్థానికులు కాపాడారు. కొందరు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చారు. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ‘‘భారీ వర్షం పడటంతో జట్నీలోని సీతారాంపూర్ కూడలి దగ్గర బస్సు నీటిలో మునిగిపోయింది. స్మార్ట్‌సిటీ భువనేశ్వర్ శివారులోనే ఇలా జరగడం ఘోరం. బస్సులో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. అదృష్టంకొద్ది అందరూ క్షేమంగా బయటపడ్డారు’’ అని స్థానికులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)