తిరుపతి: ప్రాణాలు మింగేస్తున్న మ్యాన్‌హోల్స్-మురుగు కాలువల్లోకి ఇంకా మనుషులే దిగాలా

ప్రచురణ

మ్యాన్‌హోల్‌ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? ఈ రోజుల్లో కూడా మ్యాన్‌హోల్‌లో మనుషులు దిగి శుభ్రం చేయాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? ఇలా చేయడం చట్టబద్ధమేనా?

ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తెరపైకి వస్తుంటాయి.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో మనుషులు దిగకుండా క్లీన్ చేయడానికి సీవర్ క్రాక్ మిషన్లు ప్రపంచమంతా వాడుతున్నారు. అమెరికా లాంటి దేశాలలో మ్యాన్‌హోల్‌లోకి దిగరు. కానీ, ఈ యంత్రాలను భారత్‌లో ఎక్కడా వాడడం లేదని ఈ రంగంలో పని చేస్తున్నారు వారు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా మ్యాన్‌హోల్స్‌లో పడి చనిపోయే కార్మికుల సంఖ్యను తగ్గించి చూపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుందని, ఆ శ్రద్ధ ఆధునిక యంత్రాల కొనుగోలుపై పెట్టడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)