అభివృద్ధి అన్న మాటే తమను భయపెడుతోందంటున్న ఆదివాసులు

వీడియో క్యాప్షన్, అభివృద్ధి అన్న మాటే తమను భయపెడుతోందంటున్న ఆదివాసులు
ప్రచురణ

బస్తర్‌లోని నక్సల్ ప్రభావిత సుక్మా జిల్లాలో పారా మిలిటరీ బలగాల క్యాంపులకు వ్యతిరేకంగా ఆదివాసులు మొదలుపెట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయింది.

దిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతుల ప్రదర్శన తర్వాత, ఇంత సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉద్యమం ఇదేనని చెప్పొచ్చు.

నిరసన తెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గ్రామీణులు మరణించిన ఘటన తర్వాత ఉద్యమం మరింత ఊపందుకుంది.

క్యాంపుల కోసం అడవుల్ని నరికివేస్తున్నారని, నిర్దోషులను పట్టుకొని నక్సలైట్ల పేరుతో జైలుకు పంపిస్తున్నారని ఆదివాసులంటున్నారు.

కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాలు డ్రోన్ల ద్వారా బాంబులు పడవేశారని కూడా ఆదివాసులు ఆరోపిస్తున్నారు.

బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)