అమలాపురంలో విధ్వంసం: మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇళ్లకు నిప్పు

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై మొదలైన ఆందోళన తీవ్రరూపం దాల్చింది.

అమలాపురంలో పోలీస్ ఆంక్షలు ఉల్లంఘించి వందల మంది రోడ్లపైకి వచ్చారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు కూడా జరిపారు.

కొందరు యువకులు బారికేడ్లు, అడ్డుగా పెట్టిన వాహనాలను తోసుకుంటూ కలెక్టరేట్ వైపు దూసుకెళ్లారు. నిరసన చేస్తున్నవారిలో కొందరు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు గాయాలపాలయ్యారు.

మంత్రి విశ్వరూప్ ఇంటికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. ఆయన ఇంటికి సమీపంలో మూడు ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేశారు. బస్సు తగలబడుతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)