తెలంగాణలో ఆ జిల్లా ప్రైవేటు ఆసుపత్రుల్లో వెయ్యికి 928 మందికి సిజేరియన్లే

ప్రచురణ

తెలంగాణలో భారీ సంఖ్యలో జరుగుతున్న సిజేరియన్ మరోసారి చర్చల్లోకి వచ్చాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ తరహా శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి.

సీ-సెక్షన్స్ ఆపరేషన్లలో కరీంనగర్ జిల్లా సగటు 82.4 శాతం ఉండగా, ఇక్కడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏకంగా 92.8 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. అందులోనూ ఫలానా టైమ్, ఫలనా ముహూర్తం అంటూ ఏరికోరి చేసుకునే ప్రసవాల ట్రెండ్, సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గడానికి ఒక కారణంగా గుర్తించిన జిల్లా యంత్రాంగం పురోహితులు, పంచాంగకర్తలతో సమావేశమైంది.

అధికారుల సూచనలపై కరీంనగర్ జిల్లా పురోహితులు స్పందిస్తూ.. ప్రసవాలకు ముహూర్తాలు చూడబోమని ఆలయాల్లో ప్లెక్సీలు పెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)