దిల్లీలో అగ్నిప్రమాదం: ‘భవనంలో మా చెల్లి కనిపించింది.. కానీ అటువెళ్లి ఇటువచ్చేసరికి అక్కడ లేదు.. ఫోన్ కూడా కలవట్లేదు’

వీడియో క్యాప్షన్, దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి
ప్రచురణ

దేశ రాజధాని దిల్లీలోని ముండ్కాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారని ఔటర్ డీసీపీ సమీర్ శర్మ తెలిపారు.

ముండ్కా రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారని, క్షతగాత్రులను సంజయ్ గాంధీ ఆస్పత్రి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలకు తరలించి చికిత్స అందిస్తున్నారని దిల్లీ ఔటర్ డిస్ట్రిక్ట్ ఏసీపీ బీబీసీ ప్రతినిధికి చెప్పారు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)