అసాని తుపాను: ఉత్తరాంధ్రలో మొదలైన వర్షాలు
ప్రచురణ
అసాని తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వానలు పడుతున్నాయి. సముద్ర తీరాల్లో అలలు ఎక్కువ వేగంతో ఎగిసి పడుతున్నాయి. వాతావరణం అనుకూలించక పోవడం వల్ల వైజాగ్ రావాల్సిన విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చెన్నై విభాగం తెలిపింది.
అసాని తీవ్ర తుపాను గంటకు 7 కి.మీ. వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు.
అసాని తుపాను ప్రస్తుతం కాకినాడకు 330, విశాఖపట్నానికి 350, పూరీకీ 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఈరోజు ఉదయం 6:30 గంటలకు విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: అత్యాచారాలు, గ్యాంగ్రేప్లు పెరుగుతున్నాయా... హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లలో కూడా ఎలా జరుగుతున్నాయి?
- రష్యన్ ఓలిగార్క్ సూపర్ యాట్ల విలాసం: 3డి సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, స్పా, జిమ్లు, బార్లు..
- ఇమ్రాన్ ఖాన్: ‘గాడిద ఎప్పుడూ గాడిదే.. చారలు గీచినంత మాత్రాన జీబ్రా కాదు’ అని ఎందుకు అన్నారు?
- చటేశ్వర్ పుజారా: వరుసగా 4 మ్యాచ్ల్లో 4 సెంచరీలు.. అందులో రెండు డబుల్ సెంచరీలు
- కాజల్ అగర్వాల్: 'నిన్ను కన్న క్షణమే నీతో ప్రేమలో పడిపోయా...'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)