ఉత్తరప్రదేశ్: ఉన్నావ్‌లో ఆస్పత్రి గోడకు శవమై వేలాడుతూ కనిపించిన నర్సు

వీడియో క్యాప్షన్, ఉత్తరప్రదేశ్: ఉన్నావ్‌లో ఆస్పత్రి గోడకు శవమై వేలాడుతూ కనిపించిన నర్సు
ప్రచురణ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో 18ఏళ్ల నర్సు శవం ఓ ఆసుపత్రి గోడకు వేలాడుతూ కనిపించింది.

తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిందని బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులపై ఆరోపణలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఆసుపత్రిని కూడా సీల్ చేశారు.

న్యూ జీవన్ ఆసుపత్రిలో బాధితురాలు ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఈ ఘటన జరిగింది. మరోవైపు ఆ ఆసుపత్రిని కూడా బాంగర్మవూలోని దుల్లాపురవాలో ఐదు రోజుల కిందటే ప్రారంభించారు.

ఏప్రిల్ 25న స్థానిక ఎమ్మెల్యే ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ప్రాంతానికి సమీప గ్రామంలో బాధితురాలు ఉండేవారు.

ఈ ఘటనపై పోలీసులు ఏం చెబుతున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)