నవనీత్ కౌర్ చుట్టూ ముసురుకున్న వివాదం ఏమిటి? ముంబయిలో ఏం జరిగింది

వీడియో క్యాప్షన్, నవనీత్ కౌర్ చుట్టూ ముసురుకున్న వివాదం ఏమిటి? ముంబయిలో ఏం జరిగింది
ప్రచురణ

మహారాష్ట్రలో శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని, దమ్ముంటే తనను ఆపాలని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానా.. ఆ ఆందోళనను విరమించుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు.

అంతకుముందు.. శనివారం ఉదయం ముంబయిలోని నవనీత్ కౌర్ నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శివసేన కార్యకర్తలు ఆమె నివాసం ఎదుట నిరసన చేపట్టారు. మరోవైపు రానా దంపతులు మాతోశ్రీ వద్దకు వస్తే వారికి ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసని శివసేన నాయకురాలు, ముంబయి నగర మాజీ మేయర్ కిశోరి పెడ్నేకర్ వ్యాఖ్యానించారు.

''వారి కోసం మేం ఎదురు చూస్తున్నాం. వారు వస్తే గుణపాఠం చెబుతాం'' అని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాలపై నవనీత్‌ కౌర్ స్పందిస్తూ.. ''మాకు అవరోధాలు సృష్టించాలని శివసేన కార్యకర్తలకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచించారు. అందుకే వారు బారికేడ్లు తోసుకుని వస్తున్నారు. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను. కచ్చితంగా మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా చదువుతాను'' అని ఉద్ఘాటించారు.

కానీ మధ్యాహ్నం మూడు గంటలు దాటిన తర్వాత రానా దంపతులు.. హనుమాన్ చాలీసా ఆందోళనను విరమించుకుంటున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)