ఆంధ్రప్రదేశ్: కొండరెడ్ల జీవితాల్లో అక్షర దీపం వెలిగిస్తున్న కొండబడి
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త హంగులు అద్దుతున్నారు. పలు సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. నాడు-నేడు పేరుతో కొంత ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల సంఖ్య కూడా పెరుగుతోంది.
కానీ, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న మారుమూల మన్యం వాసులకు చదువు కావాలంటే కొండలెక్కుతూ, దిగుతూ కనీసం ఐదారు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిందే. ఇక గిరిజనుల్లో వేగంగా అంతరించిపోతున్న తెగలుగా గుర్తించిన జాబితాలో ఉన్న కొండరెడ్డి తెగ ప్రత్యేక పరిస్థితుల కారణంగా పిల్లలు చదువులకు మొగ్గు చూపడం లేదు.
తల్లిదండ్రులను వదిలి, ఇతర పిల్లలతో కలిసి గిరిజన హాస్టళ్లలో ఉండేందుకు వారు ఇష్టపడడం లేదు. అందుకే వారికోసం కొండలపైనే ఓ బడి ఏర్పాటయ్యింది.
చింతూరు ఐటిడిఎ అధికారుల చొరవతో పీవీటీజీ ( పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్) తెగ కొండరెడ్డి పిల్లలకు చదువులు నేర్పే ప్రయత్నం మొదలయ్యింది.
ఇవి కూడా చదవండి:
- కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ల నుంచి మన కళ్లను ఎలా కాపాడుకోవాలి?
- బ్రిటిష్ కాలం నాటి వించ్ రవాణా: డ్రైవర్ ఒకచోట, వాహనం మరోచోట.. చూస్తే భయం, ఎక్కితే సరదా
- యుక్రెయిన్పై రష్యా దండెత్తినా అమెరికా సైన్యం ఎందుకు రంగంలోకి దిగలేదు? మీరు తెలుసుకోవాల్సిన 6 కీలక అంశాలు..
- చనిపోయే ముందు జీవితం మన కళ్ల ముందు కనిపిస్తుంది - తాజా అధ్యయనం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)